కేవలం భారత్ లో అవినీతి నిండిన డబ్బు దాచుకున్నవారినే కాదు, నకిలీ కరెన్సితో ఉగ్రవాదులు పన్నుతున్న పన్నగాల తాట కూడా తీసింది కరెన్సి బ్యాన్.దాంతో కుప్పలుగా కుప్పలుగా తీవ్రవాదుల చేతుల్లో ఉన్న భారత 500, 1000 నోట్లు పనికిరాని కాగితాలుగా మారిపోయాయి.
అయితే, ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకోవాల్సిన అవసరం లేదని భారత ఇంటలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.
కొత్తగా విడుదల చేసిన రూ.2000, రూ.500 నోట్ల యొక్క సెక్యూరిటీ ఫీచర్స్ ని పాక్ ఇప్పటికే కాపి కొట్టేసిందట.కరాచి దగ్గర భారత నకిలీ నోట్లను ముద్రించే ప్రెస్ ని కూడా ఐఎస్ఐ నడుపుతున్నట్లు, ఈ వ్యవహారానికి దావుద్ ఇబ్రహీం గ్యాంగ్ మద్దతు ఉన్నట్లు ఇంటలిజెన్స్ బ్యూరో, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఎజెన్సి భారత ప్రభుత్వానికి తెలిపాయి.
నోట్లను సరిగ్గా కాపి కొడుతున్న పాక్ శక్తులు, మన నోటుకోసం వాడుతున్న పేపర్ ని మాత్రం కనిపెట్టలేకపోతున్నాయట.
ఒరిజినల్ నోట్లకు, పాక్ తయారుచేస్తున్న నకిలీ నోట్లకు పేపర్ విషయంలో చాలా తేడా ఉందని, అయితే రిజర్వ్ బ్యాంకు కొత్త నోట్ల కోసం పేపర్ ఎక్కడినుంచి తీసుకొస్తుందో తెలిసిపోతే ప్రమాదమే అని, ఆ నోట్లని తీవ్రవాదులు తమ కార్యకలాపాల కోసం వాడుకోవడం కాని, భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు ఆ నోట్లను మన దేశంలోకి తీసుకురావడం కాని జరగవచ్చు అని ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి ఇంటలీజెన్స్ వర్గాలు.