మొత్తానికి ఎన్టీఆర్ తదుపరి సినిమాపై ఓ క్లారిటి వచ్చింది.త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరి జగన్నాథ్, వక్కంతం వంశీ, అనిల్ రావిపూడి .
ఈ నాలుగు పేర్లు వినబడితే, ఇప్పుడు నలుగురిలో పూరి జగన్నాథ్ మాత్రమే మిగిలిపోయారు.కొన్నిరోజులు సస్పెన్స్ క్రియేట్ చేసినా, చివరికి పవర్ స్టార్ ప్రాజెక్ట్ మీదకే వెళ్ళిపోయారు త్రివిక్రమ్.
డిసెంబరులో ఈ సినిమా మొదలవుతుందట.
ఇక వక్కంతం వంశీ కథ నచ్చలేదని, అందుకే సినిమా క్యాన్సిల్ అయ్యిందని ఇప్పటికే కళ్యాణ్ రామ్ ప్రకటించేసాడు.
మరోవైపు అనిల్ రావిపూడి ఎన్టీఆర్ మీద ఆశలు వదులుకోని, కళ్యాణ్ రామ్ తో ప్రాజెక్టు మీద పనులు మొదలుపెట్టాడని, ఈ పటాస్ కాంబినేషన్ త్వరలోనే సెట్స్ మీదకి వెళుతుందని వార్తలు వస్తున్నాయి.ఇక మిగిలిపోయింది పూరి జగన్నాథ్ ఒక్కరే.
ఈరోజే విడుదలైన ఇజంకి ఫర్వాలేదనే రిపోర్ట్స్ వస్తున్నాయి కాబట్టి, పూరితో మరోసారి సినిమా తీసేందుకు ఎన్టీఆర్ వెనకడుగు వేయకపోవచ్చు.సో, అతి త్వరలోనే ఎన్టీఆర్ – పూరి జగన్నాథ్ సినిమా మొదలైతే ఆశ్చర్యపోనక్కరలేదు.