ఎన్టీఆర్ సినిమాకి మాత్రమే నష్టం వచ్చిందట

నిర్మాతగా మారిన తరువాత బండ్ల గణేష్ తీసిన సినిమాలు ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, బాద్షా, ఇద్దరమ్మాయిలతో, నీ జతగా నేనుండాలి (సచిన్ జోషి సినిమా), గోవిందుడు అందరివాడేలే మరియు టెంపర్.ట్రేడ్ లెక్కలు చూస్తే , ఇన్నేసి సినిమాల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది కేవలం గబ్బర్ సింగ్ మాత్రమే.

 Only Baadhshah Caused Me Loss – Bandla Ganesh-TeluguStop.com

ఆ తరువాత చెప్పాలంటే బాద్షా, టెంపర్ చిత్రాలు బానే ఆడాయి, కాని రెండు పంపిణిదారులకి చిన్నిపాటి నష్టాల్నే మిగిల్చాయి.ఇక మిగితావన్ని బాక్సాఫీస్ వద్ద పరాభవాన్ని చూసినవే.

ముఖ్యంగా తీన్ మార్ చాలా పెద్ద ఫ్లాపు.కాని తనకి మాత్రం నష్టం ఒక్క బాద్షా సినిమాకే వచ్చింది అని అంటున్నారు నిర్మాత బండ్ల గణేష్.

బడ్జెట్ ఎక్కువ అవడం వలన బాద్షాకి నష్టాలు వచ్చాయట.మరి ఫ్లాపులుగా మిగిలిన సినిమాలకు ఎలా నష్టాలు రాలేదో, ఆ లెక్కలేంటో, మనకన్నా నిర్మాతకే బాగా తెలుసు కాబట్టి గమ్మున ఉందాం.ఇక అదే ఇంటర్వ్యూలో తన రాజకీయ ఆకాంక్షలను కూడా బయటపెట్టారు బండ్ల.

2019 అసెంబ్లీ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేస్తూ జనసేన పార్టి తరఫున పోటి చేయానున్నారట ఈ నిర్మాత.“అధ్యక్షా” అంటూ అసెంబ్లీ లో ప్రసంగించటం ఆయనకున్న ఆశ.2019 లో జనసేన పార్టీ వన్ సైడ్ వార్ లో గెలిచి ఆధికారంలోకి రావడం, తను మంత్రీగా బాధ్యతలు చెప్పడటం ఖాయమని ధీమా వ్యాక్తం చేసారు బండ్ల గణేష్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube