బాక్సాఫీస్ పరంగా చూస్తే నాగార్జున కెరీర్లో “మాయని మచ్చ” లాగా మారిపోతోంది ఓం నమో వెంకటేశాయ.టాక్ మరీ ఘోరంగా రాకపోయినా, ఈ సినిమా మీద జనాలకి ఎందుకు ఆసక్తి కలగట్లేదో అర్థం కావడం లేదు ట్రేడ్ వర్గాలకి.
ఎలాగో అందరు డిస్ట్రిబ్యూటర్స్ నిండా మునుగుతున్నారు కాని, ఈస్ట్ గోదావరి పరిస్థితి మాత్రం మరీ బయటకి చెప్పుకోలేని విధంగా ఉంది.
ఈస్ట్ లో ఆరొవ రోజు కేవలం 20 వేల షేర్ సంపాదించిన ఈ సినిమా, ఏడొవ రోజు, అంటే నిన్న ఒక్క రూపాయి కూడా షేర్ రాబట్టలేదంటే నమ్మండి.
వచ్చిన గ్రాస్ లో ట్యాక్స్, థియేటర్ రెంట్, మిగితా చిల్లర ఖర్చులు పోతే, రూపాయి కూడా మిగలకపోగా, డిఫిసిట్స్ పడ్డాయంట.దానర్థం, రోజంతా కలిపినా, రూ 1 కూడా సంపాదించలేకపోయింది ఓం నమో వెంకటేశాయ.
ఒక టాప్ హీరో సినిమాకి ఇలాంటి అవమానం జరగడం నిజంగా బాధాకరం.కాని ఒకలాంటి ఆశ్చర్యం .సినిమాని మరీ ఇంత దారుణంగా ప్రేక్షకులు ఎందుకు రిజెక్టు చేసినట్టు? ఈస్ట్ లో సినిమాని కొన్న బయ్యర్లకు నిద్ర పడుతుందో లేదో, ఒక్కపూట అయినా మెతుకులు దిగుతున్నాయో లేదో .పాపం.