హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసే బిగ్ బాస్ ఎంత పాపులరో మీకు తెలిసిందే.వివిధ రంగాల్లోంచి వచ్చే సెలబ్రిటీలు ఒకే ఇంట్లో మూడు నెలల పాటు ఉండటం, వారికి టాస్కులు ఇవ్వటం, వారిలో వారికి గొడవలు, ప్రేమలు, పగలు .
అబ్బో ఓ సినిమాలాగే సాగిపోతుంది షో.వారిలో మనకు నచ్చిన కంటెస్టెంట్స్ కి మనం ఓట్లు వేసుకోవాలి.వారి ప్రవర్తన బట్టి వేస్తామో, వారి గ్లామర్ ని బట్టి వేస్తామో మన ఇష్టం.బిగ్ బాస్ మనల్ని రంజింపజేయాలంటే అందులో కాంట్రవర్సీ ఉండాలి, అలాగే గ్లామర్ ఉండాలి.
అలాంటివి తీసుకొచ్చే పార్టిసిపెంట్స్ కావాలి.
అందుకే పోసాని కృష్ణమురళిని కలిసారట నిర్వాహకులు.
పోసాని మాటతీరు ఎంత ముక్కుసూటిగా ఉంటుందో మనకు తెలిసిందే.ఆయన ఏం మాట్లాడిన అందులో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది.
ఇలాంటివారే బిగ్ బాస్ లో ఉండాల్సింది.ఇక గ్లామర్ లేకపోతే షో ఎలా నడుస్తుంది? అందుకే తేజస్వీ మడివాడ, మధుశాలినిలను సంప్రదించారట.అయితే ఈ ముగ్గురిలో ఎవరు ఇంకా ఎస్ ఆర్ నో చెప్పలేదు.
వీరికి రెమ్యునరేషన్ కూడా భారీగానే ఆఫర్ చేస్తున్నారు.ముఖ్యంగా పోసాని కృష్ణమురళి ఖచ్చితంగా అవసరమని, ఆయనే ఈ షోకి ఎన్టీఆర్ తరువాత అతిపెద్ద స్టార్ అని నమ్మతోంది స్టార్ మా యాజమాన్యం.అందుకే ఏకంగా 2.5 కోట్ల ఆఫర్ పోసాని ముందు పెట్టారట.అంత పెద్ద మొత్తం ఎందుకు అంటే, మూడు నెలలపాటు ఆయన సినిమాలు చేయలేరు కదా.మరి మూడు నెలల షోకోసం కేటాయించాలంటే ఆ మాత్రం ఇవ్వాల్సిందే కదా.
ఈ లెక్కన తేజస్వీకి కూడా బాగానే ముట్టాలి అనుకుంటున్నారా? అలా ఏం లేదు.ఎవరి మార్కేట్ ని బట్టి వారికి రేటు.తేజస్వీ, మధుశాలిని, ఇద్దరికి ఓ 20 లక్షలు ఇస్తామన్నారని టాక్.ఈ లిస్టు ఇక్కడితో ఆగిపోదు.ఇంకా చాలామంది సెలబ్రిటిలు వస్తారు.