వీలైనంతవరకు ట్యాక్స్ తగ్గించుకోవడానికి సెలబ్రిటీలు రకరకాల తంటాలు పడుతూ ఉంటారు.ఈ విషయంలో చాలామంది అంతే అయినా, దొరికే దాకా ఎవరి ప్లాన్ బయటపడదు.
మొన్న త్రిష ట్యాక్స్ లో కొంతభాగం ఎగ్గొట్టే ప్రయత్నం చేసి దొరికిపోయింది.షోకాజు నోటీసులు అందుకుంది.
ఇప్పుడు కొత్తగా ఎన్టీఆర్ కి షోకాజు నోటీసులు అందబోతున్నాయి.ట్యాక్స్ ఎగ్గోట్టాడు అనే ఆరోపణ ఉంది ఎన్టీఆర్ మీద.అది కూడా 1.10 కోట్లు.
ఎన్టీఆర్ ఒక్కడనే కాదు, చాలామంది సినిమా వారు ఫారెన్ లో ఎక్కువ షూట్ ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు అంటే, తమ పారితోషికంలో కొంతభాగం, లేదంటే అధికభాగం ఫారెన్ కంపెనీల నుంచి అందుకునే ప్రయత్నం చేస్తారు.ఇక్కడా కూడా డబ్బు నిర్మాతదే అయినా, ఇచ్చే చేతులు మారుతాయి అంతే.
ఇలా ఎందుకు అంటే దీన్ని “Export of services” లా చూపిస్తే ట్యాక్స్ భారం పడదు.అందుకే ఎంతోకొంత ట్యాక్స్ తప్పించుకునేందుకు ఈ పని చేస్తూ ఉంటారు.
నాన్నకు ప్రేమతో సినిమా లండన్ లో షూట్ చేసారు.ఈ సినిమాకి 7.33 కోట్ల పారితోషికాన్ని ఓ లండన్ కంపెని ద్వారా అందుకున్నాడటా ఎన్టీఆర్.దాన్ని “Export of services” లా చూపించే ప్రయత్నం చేసి దాదాపుగా 1.10 కోట్ల ట్యాక్స్ కట్టకుండా వదిలేశాడట.CAG శుక్రవారం పార్లమెంట్ లో సినిమాతారలు ఇలా చేస్తున్నారు అని ఓ రిపోర్ట్ సబ్మిట్ చేసింది.
ఆ తారల్లో ఎన్టీఆర్ కూడా ఉండటం ఇక్కడ విశేషం.
అందుకే ఎన్టీఆర్ కి త్వరలో షోకాజు నోటీసులు అందబోతున్నాయి.
మరి ఈ విషయంలో ఎన్టీఆర్ ఎలాంటి వివరణ ఇస్తాడో, చివరకి తప్పు ఎవరివైపు ఉన్నట్లు తేలుతుందో చూడాలి.ఇక సినిమాల విషయానికి వస్తే, జైలవకుశకి సంబంధించిన రెండోవ టీజర్ 7వ తేదిన విడుదల కాబోతోంది.
సినిమా సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.