ఎన్టీఆర్ బిగ్ బాస్ ఆల్రెడీ సంచలనాత్మక రీతిలో మొదలైంది.ఇంకా ఇంటి లోపల పెద్ద సంచలనాలు జరగలేదు కాని, టీఆర్పి రేటింగ్స్ లో మాత్రం మంచి రెస్పాన్స్ కనబడుతోంది.
తొలిరోజే పెద్ద ట్విస్టుతో మొదలైంది షో.సంపూర్నేష్ బాబుని ఎలిమినేషన్ కి మిగితా కన్తెస్ట్టెంట్స్ నామినేట్ చేస్తే, సంపూ ఏకంగా కెప్టెన్ అయి కూర్చున్నాడు.సంపూ కెప్టెన్ అవడానికి బిగ్ బాస్ కారణం ఏమో కాని, సంపూ బిగ్ బాస్ హౌస్ లో ఉండటానికి కారణం మాత్రం మరెవరో కాదు ఎన్టీఆర్ అని తెలుస్తోంది.అవను, ఎన్టీఆర్ పట్టుబట్టి మరి సంపూర్నేష్ బిగ్ బాస్ లోకి వచ్చేలా చేసాడట.
బిగ్ బాస్ సీజన్ 1 కి స్టార్ మా యాజమాన్యం ఎంపిక చేసిన మెంబర్స్ లో అధికశాతం ఎన్టీఆర్ కి నచ్చినా, తనవంతుగా రెండు మార్పులు చేసాడు.
నిజానికి సంపూర్నేష్ బాబు, ధన్ రాజ్, ఇద్దరూ కూడా మొదట లిస్టులో లేరంట.
ఎన్టీఆర్ ఆ లిస్టు లోంచి ఇద్దర్ని తీసేసి, సంపూ, ధన్ రాజ్ కావాల్సిందే అనడంతో మేకర్స్ వారిద్దరిని సంప్రదించి షోలోకి తీసుకొచ్చారు.మరి ఎన్టీఆర్ వలన చోటు కోల్పోయిన ఆ ఇద్దరు సెలబ్రిటీలు ఎవరు ? ఆ ఇద్దరిలో తేజస్వీ మడివాడ లేదు కదా ? ఎందుకంటే తేజస్వీ పేరు మొదటినుంచి వినబడుతోంది.కాని ఫైనల్ లిస్టులో తను లేదు.ఇక పోసానిని తీసుకురావడం కోసం మేకర్స్ ఎన్నో ప్రయత్నాలు చేసినా, ఎందుకో మరి పోసాని పెద్దగా ఆసక్తి చూపించలేదు.
షూటింగ్ లో బిజీగా ఉండటం, ఇచ్చిన డేట్స్ ని వెనక్కి తీసుకునే ఉద్దేశం లేకపోవడం వలన ఏమో, భారి పారితోషికం ఆఫర్ చేసినా లొంగలేదు పోసాని.
ఇక పారితోషికం అంటున్నాం కాబాట్టి, ముమైత్ ఖాన్ కి అత్యధికంగా డబ్బు అందుతోందట.
మరి ఖర్చు పెడుతున్నందుకు, ఆవిడ ఎన్నిరోజులు బిగ్ బాస్ ఇంట్లో ఉండగలుగుతుందో చూడాలి.అలాగే ఎన్టీఆర్ పట్టుబట్టి తీసుకొచ్చిన సంపూర్నేష్ బాబు, ధన్ రాజ్ ఎంతకాలం నిలబడి ఉంటారనేది ఆసక్తికరం.