యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం ‘టెంపర్’.ఈ చిత్రం ఆడియో వేడుకను నిన్న రాత్రి శిల్పకళా వేదికలో వైభవంగా జరిగింది.
ఈ ఆడియో వేడుకలో నందమూరి ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చారు.పూరి జగన్నాద్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా కాజల్ నటించింది.
ఇక ఈ సినిమా గురించి నందమూరి అభిమానులు అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.అందుకు తగ్గట్లే ఈ సినిమాను చేశానంటున్నాడు ఎన్టీఆర్.
ఈ సినిమా ఆడియో వేడుకలో ఎన్టీఆర్ భావోద్వేగంతో మాట్లాడి అభిమానుల గుండెలను పిండేశాడు.
అభిమానులు తనకు తోడ పుట్టక పోయినా సొంత అన్న తమ్ముల లెక్క అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.
వారి కోసం తాను సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.మిమ్ములను గత మూడు చిత్రాలు నిరాశ పర్చాయి.
ఆ మూడు చిత్రాల వల్ల నేను కూడా బాధపడ్డాను.అయితే ఎప్పటికైనా నందమూరి అభిమానులు కాలర్ ఎత్తుకుని తిరిగేలా చేయాలనేదే నా కోరిక.
తప్పకుండా అభిమానులను పూర్తి స్థాయిలో సంతృప్తిపర్చే చిత్రం వస్తుంది.ఇది కాకుంటే, మరోటి అంటూ అభిమానులను ఎన్టీఆర్ ఉత్సాహ పర్చాడు.
ఈ సినిమాపై తనకు చాలా అంచనాలే ఉన్నాయంటూ ఎన్టీఆర్ చెప్పకనే చెప్పాడు.ఈ చిత్రంతో ఎన్టీఆర్ కోరుకున్నట్లుగా నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుని ఈ సినిమా గురించి చెప్పుకుంటారో చూడాలి.