రీసెంట్ గా జనతా గ్యారేజ్ హిట్ తో మంచి జోష్ లో ఉన్న జూనియర్ సినిమా సక్సెస్ పట్ల తన ఆనందాన్ని నిన్న జరిగిన థాంక్స్ మీట్ లో బయటపెట్టాడు.జనతా లాంటి సినిమా ఇచ్చినందుకు దర్శకుడు కొరటాల శివకు ఆజన్మాంతం ఋణపడి ఉంటానని అన్నారు.
ఇక టెక్నికల్, కో స్టార్స్, జనతా గ్యారేజ్ మెకానిక్ అందరి సహకారం వల్లే సినిమా సక్సెస్ అయ్యిందని అన్నారు.ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా రిలీజ్ కు ముందే 15 కోట్ల టేబుల్ ప్రాఫిట్ తీసుకుంది.
ఈ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో కళ్యాణ్ రాం ప్రొడ్యూసర్ గా ఓ సినిమా కమిట్ అవ్వగా ఆ తర్వాత సినిమా మళ్లీ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలోనే ఉంటుందని టాక్.శ్రీమంతుడుతో నిర్మాతలుగా మారిన మైత్రి మేకర్స్ వారు రెండో సినిమాగా జనతా గ్యారేజ్ నిర్మించడం జరిగింది.
సినిమా ఇప్పటికే మంచి లాభాలతో నడుస్తుంది.జూనియర్ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచిన ఈ సినిమాతో మైత్రి మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది.