2009 వ సంవత్సరంలో తమిళ దినపత్రిక దినమలర్ లో ఓ వివాదస్పదమైన కథనం ప్రచురితమైంది.దాంట్లో కొందరు తమిళ హీరోయన్లు వ్యభిచారం చేస్తున్నారని కొందరు వర్థమాన, స్టార్ కథానాయికల పేర్లు, ఫోటోలు వాడుతూ ఓ వార్త రాసారు.
ఈ ఆరోపణలు పచ్చి అబద్ధాలంటూ అప్పట్లో తమిళనటులు తీవ్ర ఆందోళన చెప్పట్టారు.విషయం ఎక్కడిదాకా వెళ్ళింది అంటే ఆ దినపత్రిక ఎడిటర్ లెనిన్ ని పోలీసులు అరెస్టు చేయాల్సివచ్చింది.
ఈ వివాదం ఇక్కడితో ఆగిపోతుంది అని అనుకున్న సమయంలో సూర్య, సత్యరాజ్ తో సహా మరికొంతమంది తమిళనటులు మీడియాపై, జర్నలిస్టులపై కొన్ని సంచలనాత్మక వ్యాఖ్యలు చేసారు.వారిని కొన్ని అనరాని మాటలు అన్నారు.
దాంతో ఊటి జర్నలిస్టుల సంఘం వారు సూర్య, సత్యరాజ్ తో పాటు మరో ఆరుగురి నటులపై పరువు నష్టం కేసు వేసారు.విచారణ మొదలైతే అయ్యింది కాని సూర్య, సత్యరాజ్ ఎప్పుడు కోర్టుకి హాజరు కాలేదు.
ఇన్నేళ్ళు గడిచినా కేసు ఎలా మొదలైందో అలానే ఉంది.కోర్టు పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఫలితం లేకుండాపోయింది.
దాంతో కోర్టు సూర్య, సత్యరాజ్ తో సహా మొత్తం ఎనిమిది మంది మీద నాన్ బేయిలెబుల్ వారెంట్ జారీ చేసింది.విచారణకు హాజరు కావాల్సిన తేదిని జూన్ 17కి వాయిదా వేసి మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.
ఈసారి కూడా డుమ్మా కొడితే కఠిన చర్యలు తప్పవంట.