కాపుల పేరు చెప్పుకుని కాంగ్రేస్ ప్రభుత్వంలో సహాయ మంత్రి పదవులు అనుభవించిన దాసరి నారాయణరావు, చిరంజీవిలు తమ కులానికి చే సిందేంలేదని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ మంత్రి నారాయణ తీవ్ర స్తాయిలో విరుచుకు పడ్డారు.శనివారం మహానాడు వేదికపై నుంచి ఆయన మాట్లా డుతూ, కాపుల అభివృద్ధే తన బాధ్యత అని దాసరి నారాయణరావు ఈ రోజు తనని కలసిన కాపు నేత ముద్రగడతో అన్నట్టు టివీలలో చూసానని.
అధికారంలో ఉన్నప్పుడు కాపులను గాలికి వదిలేసి, ఫలాలు తామనుభవించిన ఈ నాయకులు రాస్ట్రానికి , కనీసం కాపు కులానికి చేసింది ఏమిటో వివరించాలని డిమాండ్ చేసారయన.
అధికారంలో ఉన్నన్నాళ్ళూ ఏనాడూ కాపుల సమస్యలపై నోరు తెరిచి మాట్లాడని ఈ నేతలను పట్టుకుని ఏం సాధించాలను కుంటున్నరో ప్రజలకి ముద్రగడ చెప్పాలని డిమాండ్ చేసారు.
గతంలో మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావుతో కలసి పని చేసిన ముద్రగడ తన గత అనుభవాలని గుర్తుతెచ్చుకోవాలని వ్యాఖ్యా నిస్తూ, తాజాగా వైసీపీ నేత జగన్ డైరెక్షన్లో పని చేస్తున్నరనటానికి బోలెడన్ని నిదర్శనాలు ఉన్నాయని అన్నారు.
.