మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా ఈనెల 21న మధ్యరాత్రి 12 గంటల సమయంలో హైదరాబాద్లో భారీ స్థాయిలో వేడుకలు నిర్వహించాలని మెగా ఫ్యాన్స్ భావించారు.అందుకు మెగా హీరోలు సైతం ముందుకు వచ్చారు.
ఆ వేడుకల్లో తాము పాల్గొంటాం అంటూ ప్యాన్స్కు భరోసా ఇచ్చారు.అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్థరాత్రి వేడుకలకు అనుమతి ఇచ్చేందుకు నిరాకరించింది.
ప్రస్తుతం దేశంలో పరిస్థితులు బాగా లేవని, హైదరాబాద్కు ఉగ్ర ముప్పు ఉందనే సమాచారం ఉందన్న ఈ నేపథ్యంలో మధ్యరాత్రి వేడుకలు ప్రమాధకరం అంటూ హైదరాబాద్ పోలీస్ కమీషనర్ మరియు హోం శాఖ మెగా ఫ్యాన్స్కు నో చెప్పినట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.
ముందుగా అనుకున్నదాని ప్రకారం గచ్చిబౌలీ స్టేడియంతో పాటు, అనేక రద్దీ ఏరియాల్లో రాత్రి 11 గంటల నుండి 12.30 వరకు మెగా సందడి చేయాలని భావించారు.ఒక్కో ఏరియాకు ఒక్క మెగా హీరో వెళ్లేలా ప్లాన్ చేశారు.
కాని పోలీసులు అనుమతి నిరాకరించడంతో మెగా ఫ్యాన్స్ ఉసూరుమంటున్నారు.చిరంజీవి 60వ పుట్టిన రోజును ఎంతో వైభవంగా జరపాలని ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల ఫ్యాన్స్ ఉవ్వ్లిూరుతున్నారు.
చివరి నిమిషంలో అయినా ప్రభుత్వం ఫ్యాన్స్కు అనుమతిని ఇస్తుందేమో చూడాలి.