‘1’ సినిమాలో మహేష్బాబుతో కలిసి నటించిన కృతిసనన్కు పెద్దగా గుర్తింపు రాలేదు.ఆ సినిమా సక్సెస్ కాకపోవడంతో ఈ అమ్మడు టాలీవుడ్పై ఆశలు వదులుకుంది.
బాలీవుడ్లో రెండు మూడు సినిమాలు చేసిన ఈ అమ్మడికి అనుకోని ఆఫర్లా నాగచైతన్య, సుధీర్ వర్మల చిత్రం ‘దోచేయ్’లో నటించే అవకాశం దక్కింది.ఈ సినిమాతో అయినా టాలీవుడ్లో జెండా పాతాలని ఈ అమ్మడు భావించింది.
అయితే ఈసారి కూడా ఈమెకు చేదు అనుభవమే ఎదురైంది.
‘దోచేయ్’ సినిమాలో ఈమె పాత్రలకు పెద్దగా ప్రాముఖ్యత లేదు.
ఉన్నంతలో ఆకట్టుకున్నా కూడా ఈమెకు ఈ సినిమా ద్వారా ఆఫర్లు వస్తాయి అంటే అనుమానమే అంటున్నారు.‘దోచేయ్’ సినిమా తర్వాత ఆఫర్లు వస్తాయని భావించిన ఈమెకు చేదు అనుభవం తప్పదని సినీ వర్గాల వారు అంటున్నారు.
ఇప్పటికే ఈమెకు పెద్దగా గుర్తింపు లేదు.ఇక ఈ సినిమా అంతంత మాత్రంగానే ఉండటంతో ఈమె బాలీవుడ్కే పరిమితం అవ్వాల్సిందే అని అంటున్నారు.
మరి ‘దోచేయ్’లా మరేదైనా అనుకోని అవకాశం ఏదైనా వస్తుందేమో అనే నమ్మకంతో ఈమె ఇంకా టాలీవుడ్పై నమ్మకాన్ని పెట్టుకునే ఉన్నట్లుగా తెలుస్తోంది.