తెలుగులో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుని దాదాపు దశాబ్ద కాలం పాటు స్టార్ హీరోల సరసన నటించిన ముద్దుగుమ్మ శ్రియ.ప్రస్తుతం శ్రియకు తెలుగులో అస్సలు ఆఫర్లే లేవు.
అటు తమిళంలో అయినా నెట్టుకు వద్దాం అంటే అక్కడ కూడా ఆఫర్లు చిక్కలేదు.అయితే అనుకోని అవకాశంగా హిందీలో ‘దృశ్యం’ రీమేక్లో నటించే అవకాశం దక్కింది.
అజయ్ దేవగన్ సరసన నటించే అవకాశం రావడంతో శ్రియ ఎగిరి గంతేసింది.తెలుగు, తమిళంలో రాకున్నా ఏకంగా బాలీవుడ్లో ఆఫర్ రావడంతో ఉబ్బి తబ్బిబయ్యింది.
తాజాగా ‘దృశ్యం’ హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మలయాళం, తెలుగు, తమిళంలో ఆకట్టుకున్న మాదిరిగానే ‘దృశ్యం’ సినిమా హిందీలో కూడా ఆకట్టుకుంది.
ఈ సినిమాలో హీరోగా నటించిన అజయ్ దేవగన్కు మంచి మార్కులు పడ్డాయి.అయితే శ్రియను మాత్రం పట్టించుకునే వారే కరువయ్యారు.
ఈ సినిమా తర్వాత ఆఫర్లు వస్తాయని భావించిన శ్రియకు నిరాశే మిగిలింది.ఈ సినిమాతో అంతో ఇంతో గుర్తింపు వస్తుందనుకుంటే ఇలా అయ్యే వరకు ఇక సినిమాలకు గుడ్బై చెప్పే ఆలోచనలో శ్రియ ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇటీవల ఈమె మీడియాతో మాట్లాడుతూ తన పెళ్లి విషయాన్ని తీసుకు వచ్చింది.త్వరలోనే పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది.
దాంతో ఈమె ఇక సినిమాలకు గుడ్ బై చెప్పినట్లే అంటూ ఆమె సన్నిహితులు అంటున్నారు.