సూపర్స్టార్ మహేష్బాబు ప్రస్తుతం నటిస్తున్న సినిమా ఫస్ట్లుక్ను న్యూ ఇయర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.తమ అభిమాన హీరో తాజా మూవీ ఫస్ట్లుక్ కొత్త సంవత్సర కానుకగా రాబోతుందని సూపర్ ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు.
అయితే అభిమానుల ఆశలపై దర్శకుడు కొరటాల శివ నీళ్లు చల్లాడు.తమ సినిమా ఫస్ట్లుక్ న్యూ ఇయర్కు విడుదల చేయడం లేదని దర్శకుడు కొరటాల శివ చెప్పుకొచ్చాడు.
ఫస్ట్లుక్ విడుదల చేసేందుకు మరింత సమయం కావాలని ఆయన అన్నాడు.
మహేష్బాబు, శృతిహాసన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు ‘శ్రీమంతుడు’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.
హీరోయిన్ పూర్ణ ఈ సినిమాలో మహేష్బాబుతో కలిసి ఐటెంసాంగ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.మైత్రి మూవీస్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే సంవత్సరం మేలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రెండు వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న మహేష్కు ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం.ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
అభిమానులు దర్శకుడు కొరటాల శివపై భారీ అంచనాలే పెట్టుకున్నారు.మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలంటే మే వరకు ఎదురు చూడాల్సిందే.