ఆంగ్లేయులు మన దేశాన్ని వదలి వెళ్లిపోయినా ఇంకా వారి అవశేషాలు పాలనా విధానాల్లో కొనసాగుతూనే ఉన్నాయి.ఇప్పటికీ అనేక చట్టాలు బ్రిటిష్ హయాంలో రూపొందించినవే ఉన్నాయి.
ప్రధానంగా పోలీసు శాఖలో, పరిపాలనలో వలసవాద విధానాలు కనబడుతున్నాయి.వీటిని వదిలించుకోవాలని మన పాలకులు ఇప్పటివరకూ అనుకోలేదు.
కాని మహారాష్ర్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అనుకున్నారు.మంత్రులకు పోలీసులు గౌరవ వందనం చేయడమేంటని ప్రశ్నించుకున్నారు.
ఈ వలసవాద విధానాన్ని ఇంకా అనుసరించడమేమిటని అనిపించిందేమో ఈ విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు.మంత్రులు, ఉన్నతాధికారులు జిల్లాలకు వెళ్లినప్పుడు పోలీసులు పోలీసులు వారికి సలాం చేయక్కర్లేదని ప్రకటించారు.‘ఇది పనికిమాలిన పని.సమయం వృథా’ అని ఫడ్నవీస్ అన్నారు.వీవీఐపీలకు భద్రతలోనూ కోత పెట్టారు.వీఐపీ సంస్కృతిని రూపుమాపుతానని చెప్పారు కూడా.ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు కూడా ఇలాంటి అభ్యుదయకరమైన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది.ప్రజాస్వామ్యంలో భూస్వామ్య కాలం నాటి విధానాలు కొనసాగడమేమిటి?
.