పేరుకే విడిపోయింది ఆంధ్రప్రదేశ్ కాని ఇద్దరు ముఖ్యమంత్రులు అన్ని అనుకుని చేస్తున్నట్టుగానే రెండు చోట్లా ఒకేలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి .స్పీకర్ పై అవిశ్వాసం పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షం అనుకుంది .
జగన్ ఏవిధంగా పెట్టాలి అని కనిపించిన దారులు వెతుకుతున్నారు .మీడియాలో ఇలా స్పీకర్ పై అవిశ్వాసం గురుంచి రావడం అలా అప్పుడే అక్కడ తెలంగాణలో మేము రెడీ అని ప్రతిపక్షం అయిన తెలుగుదేశం , కాంగ్రెస్ ఒకే చోట కూర్చుని పథకరచన చేసారు .కాంగ్రెస్స్ నేత జానారెడ్డి ని కలుసుకున్న టిడిపి నేతలు ఎర్రబిల్లి దయాకరరావు ,రేవంత్ రెడ్డి చాలాసేపు చర్చలు దంచేసారు .