‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో అల్లు అర్జున్కు జోడీగా సమంత మరియు నిత్యామీనన్లు కలిసి నటించిన విషయం తెల్సిందే.వీరిద్దరు మరోసారి ఒకే హీరోతో, ఒకే సినిమాలో రొమాన్స్కు సిద్దం అయ్యారు.
అయితే ఈసారి తెలుగులో కాకుండా తమిళ సినిమాలో వీరిద్దరు కలిసి నటిస్తున్నారు.తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ‘24’ సినిమాలో వీరిద్దరు ఆయనతో జత కట్టబోతున్నారు.
‘మనం’ ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘24’ సినిమాలో సమంత ఇప్పటికే హీరోయిన్గా ఎంపిక కాగా, తాజాగా రెండవ హీరోయిన్గా నిత్యామీనన్ను ఎంపిక చేయడం జరిగింది.
హర్రర్ సినిమాలను తెరకెక్కించడంలో సిద్ద హస్తుడిగా పేరు తెచ్చుకున్న విక్రమ్ కుమార్ ‘24’ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నాడు.
తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలని నిర్ణయించారు.అందుకే ఇద్దరు హీరోయిన్స్ కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న వారిని ఎంపిక చేశారు.
ఏఆర్ రహమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తి అయినట్లుగా తెలుస్తోంది.ఇప్పటికే ఈ సినిమా మోషన్ పోస్టర్ కూడా విడుదలై సినిమాపై అంచనాలను పెంచింది.