లవర్ బోయ్ ఇమేజ్ ఉన్న నితిన్ స్టార్ ఇమేజ్ రావాలంటే మాస్ ఆడియెన్స్ కు దగ్గరవ్వాలని చేయని ప్రయత్నాలు లేవు.దాదాపు 7,8 సంవత్సరాలుగా 12 సినిమాల దాకా ఫ్లాప్స్ మూటకట్టుకున్న నితిన్ విక్రం కె కుమార్ దయవల్ల ఇష్క్ తో హిట్ అందుకున్నాడు.
మధ్యలో రెండు ఫ్లాప్స్ వచ్చినా రీసెంట్ రిలీజ్ అఆ హిట్ తో మళ్ళీ మాస్ సినిమాల మీద ఉన్న మోజు బయటపడ్డది.అందుకే తన వెంట ఎంతమంది దర్శకులు వెంటపడుతున్నా తను మాత్రం మాస్ డైరక్టర్ తో సినిమా తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.
అఆ హిట్ తో నితిన్ కూడా 50 కోట్ల హీరో అయ్యాడు.సంపత్ నంది, నందిని రెడ్డి, విజయ్ కుమార్ కొండ అందరు నితిన్ కోసం వెయిట్ చేస్తుంటే.
కిశోర్ తిరుమల దర్శకత్వంలో సినిమాకు ఓకే చెప్పిన నితిన్ రీసెంట్ గా సురేందరి రెడ్డి చెప్పిన కథ మీద మనసు పడ్డాడట.మరోసారి తనలోని మాస్ యాంగిల్ తో ప్రేక్షకులను పలుకరించాలని చూస్తున్నాడు నితిన్.
అందుకే సురేందర్ రెడ్డికి ఓకే చెప్పినట్టు సమాచారం.ప్రస్తుతం చెర్రి ధ్రువ సినిమాను డైరెక్ట్ చేస్తున్న సురేందర్ రెడ్డి తర్వాత సినిమా దాదాపు ఇదే అంటున్నారు.
మరి మాస్ హిట్ కోసం తొందర పడుతున్న నితిన్ హిట్ కొడతాడో లేక మరోసారి ఆ దురద తీర్చుకుంటాడో చూడాలి.