ఈ మధ్య తెలుగు సినిమా ప్రేక్షకులకే కాదు, హీరోలకు కూడా ఫాంటసీ సినిమాల పట్ల ఆసక్తి పెరుగుతోంది.ఫోక్లోర్ జోనర్లో బాహుబలి విడుదలైనప్పటి నుంచి కొత్త ప్రయోగాలు చేయడానికి యువ హీరోలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా ఆ కోవలోకి నిఖిల్ కూడా చేరారు.నిఖిల్ సినిమాను ఒప్పకున్నాడంటే తప్పకుండా అందులో ఆసక్తికరమైన విషయం ఉండే ఉంటుంది అని సినిమా జనాలు అందరి చేతా అనిపించుకుంటున్న నిఖిల్ తన తరహా సినిమాలతో ముందుకు సాగుతున్నారు.తాజాగా ఆయన నటించిన శంకరాభరణం ఈ నెల 4న విడుదల కానుంది.22 రోజుల తర్వాత ఆయన మరో సినిమాను మొదలుపెట్టనున్నారు.అంటే ఈ నెల 26నుంచి నిఖిల్ కొత్త సినిమా మొదలు కానుంది.అదీ ఫాంటసీ జోనర్లో.ఇందులో ముగ్గురు నాయికలు ఉంటారు.టైగర్ సినిమాను తెరకెక్కించిన వి.ఐ.ఆనంద్ ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తారు.అవికాగోర్ ఇప్పటికే సెలక్ట్ అయింది.మరో నాయికగా స్వాతి పేరు కూడా వినిపిస్తోంది.స్వాతి, నిఖిల్ కలిసి నటించిన స్వామిరారా, కార్తికేయ రెండు సినిమాలూ హిట్ కావడం గమనార్హం.సో ఈ సినిమాలోనూ స్వాతి ఉంటే ఆ మ్యాజిక్ ఓకే అవుతుందా? అనేది చూడాలి.