పాము కథలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ నీరాజనమే పట్టారు.ఆ మధ్య విడుదలైన కార్తికేయ ఈ విషయానికి తాజా నిదర్శనం.
కార్తికేయ పేరు, పగబట్టిన పాము, సుబ్రమణ్య స్వామి గుడి, గర్భగుడిలోని విగ్రహం వంటి వివరాల చుట్టూ కథను తిప్పి రంజుగా తెరకెక్కించాడు చందు మొండేటి.నిఖిల్, స్వాతి జంటగా నటించిన ఆ సినిమాలో రావు రమేష్ విలన్గా కనిపించాడు.
పాము పగపట్టలేదని, దానికి హిప్నటైజ్ చేశారని తెలుసుకున్న హీరో తర్వాత ఏం చేశాడనే అంశంతో కార్తికేయ సినిమాకు సీక్వెల్ రూపొందబోతోంది.ఆగిన కథ నుంచి మరలా మొదలై హిట్ అయిన సినిమా సింగం2 మాత్రమే.
ఇప్పుడు కార్తికేయ కూడా ఆగిన చోట నుంచి మరలా మొదలు కానుంది.ప్రస్తుతం నిఖిల్ వి.ఐ.ఆనంద్ సినిమాపై దృష్టి పెట్టారు.మరోవైపు చందు మొండేటి సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగచైతన్య హీరోగా మజ్ను సినిమా చేస్తున్నారు.ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత కార్తికేయ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళనుంది.
స్క్రిప్ట్ ను ఇప్పటికే లాక్ చేశారు.సో ఇటు డైరక్టర్, అటు హీరో ఫ్రీ అయితే వెంటనే సినిమా పట్టాలెక్కనుంది.