దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టి విజువల్ వండర్గా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెల్సిందే.అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘బాహుబలి’కి ప్రస్తుతం రెండవ పార్ట్ చిత్రీకరించే సన్నాహాల్లో రాజమౌళి ఉన్నాడు.
ఈనెలలోనే రెండవ పార్ట్ చిత్రీకరణ ప్రారంభిస్తామని దర్శకుడు ఇప్పటికే ప్రకటించాడు.రెండవ పార్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు మూడవ పార్ట్ కూడా ఉండబోతుంది అంటూ ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేసి ఆశ్చర్యానికి గురి చేశారు.
తాజాగా ‘బాహుబలి’ మూడవ పార్ట్ గురించి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.‘బాహుబలి’ రెండవ పార్ట్ పూర్తి అవ్వడమే ఆలస్యం మూడవ పార్ట్ ప్రారంభం అవుతుందని, ప్రస్తుతం మూడవ పార్ట్ కోసం తాను స్క్రిప్ట్ను సిద్దం చేసే పనిలో ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు.
‘బాహుబలి’ మొదటి రెండు పార్ట్లకు మూడవ పార్ట్కు చిన్న పోలిక మరియు సంబంధం ఉండదు అని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.దాంతో ఆసక్తి మరింతగా పెరుగుతోంది.2017లో ‘బాహుబలి’ మూడవ పార్ట్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయని జక్కన్న అండ్ టీం చెబుతున్నారు.