మారుతి, వెంకటేష్ దర్శకత్వంలో అంతకుముందు రాధ అనే ఓ సినిమా స్టార్ట్ అయ్యి ఆగిపోయిన సంగతి తెలిసిందే.ఓ రచయిత కథ మారుతి దొంగిలించాడని అప్పట్లో వార్తలు హడావిడి చేశాయి.
ఆ గొడవలేవో తేల్చుకునిరా ఆ తర్వాత సినిమా తీద్దాం అని వెంకటేష్ చెప్పడంతో ఆ కథని, ఆ సినిమాను పక్కన పెట్టేశాడు మారుతి.ఇక ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లోనే వస్తున్న సినిమా బాబు బంగారం.
ఈ నెల చివరన రిలీజ్ అవుతున్న ఈ సినిమా గురించి ఆడియెన్స్ లో ఇంకా ఎక్కడో ఓ చోట ఇది రాధ కథతోనే తెరకెక్కిస్తున్నారా అని.అయితే దానికి మరోసారి మారుతి వివరణ ఇవ్వదలచాడు.
రాధ కథ కాపీ అనగానే దాన్ని ఆపేశానని.ఇది ఆ తర్వాత ఈ సినిమా పాయింట్ అనుకున్నానని అన్నారు.వెంకటేష్ మరోసారి పోలీస్ పాత్రలో కామెడీ పంచడం చూస్తారని.వెంకీ మార్క్ తో వస్తున్న ఈ సినిమాపై పూర్తి నమ్మకం ఉంది అంటున్నాడు మారుతి.
లాస్ట్ ఇయర్ భలే భలే మగాడివోయ్ తో చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని అందుకున్న మారుతి ‘బాబు బంగారం’ సినిమాతో అలాంటి హిట్ కొట్టేలానే ఉన్నాడు.గోపాల గోపాల తర్వాత వెంకటేష్ చేస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది.
గిబ్రన్ మ్యూజిక్ అందిస్తుండగా సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.ఓ వారంలో ఆడియో రిలీజ్ జరుపుకోనున్న బాబు బంగారం సినిమాను ఈ నెల 29న రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
.