కొత్త ఏడాదిని తెలుగు సినిమా ఘనంగా ఆరంభించింది.నేను శైలజా మంచి టాక్ సొంతం చేసుకుంది.
రామ్ గత చిత్రాల ప్రభావమో, నిన్నటి సంబరాల్లోంచి జనాలు ఇంకా బయటకి రాలేదో కాని, హైదరబాదులోని కొన్ని సింగిల్ స్క్రీన్స్ లో మార్నింగ్ షోల ఆకుపెన్సి 60% శాతం మాత్రమే ఉంది.కాని హైదరాబాదులో కొత్తరకం సినిమాలకి ఎప్పుడూ ఘనస్వాగతం పలికే మల్టిప్లెక్సులు రామ్ చిత్రానికి మంచి ఊపునిచ్చాయి.
ఇక ఇప్పటికే పూర్తయిన హైదరాబాద్ షోస్ నుంచి బ్రహ్మాండమైన టాక్ వస్తోంది.సూపర్ హిట్ రేంజ్ కి ఏమాత్రం తగ్గని సినిమా అంటున్నారు.
దర్శకుడు కిషోర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు యూత్ ని, ఫ్యామిలిస్ ని బాగా ఆకట్టుకుంటోంది.నెల్లురు, సీడేడ్ లో ఉదయం ఆటలు అంతలా బాగాలేకున్న టాక్ వల్ల మధ్యాహ్నం నుంచి సినిమా చాలావరకు పుంజుకుంటుందని ట్రేడ్ వర్గాల అంచనా.
రోటీన్ సినిమాల్ని ప్రేక్షకులు ఇష్టపడటం లేదని చెప్పడానికి నేను శైలజా మరో ఉదాహరణ.రామ్ కి మంచి హిట్ దక్కింది.
గత చిత్రాల నుంచి గుణపాఠం నేర్చుకోని కొత్తదారిలో వెళ్లిన రామ్ ఈ విజయానికి పూర్తిగా అర్హుడు.