టాలీవుడ్లో సహజంగా సంక్రాంతికి ఒకేసారి మూడు నాలుగు పెద్ద సినిమాలు రావడం ఆనవాయితీగా వస్తోంది.ఈ యేడాది సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.
అయితే ఈ సారి అందుకు భిన్నంగా ఒకేసారి మూడు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి.ఈ శుక్రవారం రిలీజ్ అయిన మూడు సినిమాలు భారీ అంచనాల మధ్య వచ్చాయి
ఈ మూడు సినిమాలు రూ.110 కోట్ల బిజినెస్ చేశాయి.“నేనే రాజు నేనే మంత్రి’’ ‘జయ జానకి నాయక’ ‘లై” సినిమాలు ప్రచార విషయంలో విపరీతంగా సక్సెస్ అయ్యాయి.
వాస్తవానికి ఈ మూడు సినిమాలు మూడు జోనర్స్లో తెరకెక్కాయి.ఒకే రోజు మూడు సినిమాలు రావడంతో జనాలు తొలి రోజు మూడు సినిమాలు ఆడుతున్న థియేటర్ల వైపు పరుగులు పెట్టారు
ఇక ఈ మూడు సినిమాల్లో బోయపాటి మాసిజంతో జయ జానకి నాయక బీ, సీ సెంటర్లలో దుమ్మ దులుపుతోంది.
ఏ సెంటర్లలోను ఓ మోస్తరు వసూళ్లు తెచ్చుకుంటోంది.సినిమాకు బాగుందన్న టాక్ రావడంతో తొలి రోజు మంచి వసూళ్లు వచ్చాయి.ఇక నేనే రాజు నేనే మంత్రి సినిమా ఫస్టాఫ్ బాగున్నా సెకండాఫ్ సాగదీత, తెలుగు ప్రేక్షకులకు నచ్చని యాంటీ క్లైమాక్స్ సినిమాకు మైనస్గా మారాయి.ఓవరాల్గా సినిమా ఆశించిన అంచనాలు అందుకోవడంలో విఫలమైందన్న టాక్ వచ్చింది
ఇక నితిన్ లై సినిమా ఇంటిలిజెంట్ మూవీగా టాక్ తెచ్చుకుంది.
ఏ సెంటర్లతో పాటు మల్టీఫ్లెక్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయినా బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు అర్థం కాదన్న టాక్తో నడుస్తోంది.అయితే తొలి రోజు మూడు సినిమాలు ఆడుతున్న థియేటర్ల వద్ద జనాలు పోటెత్తారు.
మరి శని, ఆదివారాల్లోనే ఈ సినిమాల పూర్తి జాతకాలు బయటకు వస్తాయి.ఏదేమైనా తొలి రోజు టాక్ తర్వాత జయ జానకి నాయక ఫస్ట్ ప్లేస్లో ఉంటే లై సెకండ్, రాజు మంత్రి మూడో ప్లేస్లో ఉన్నాయి.