మీడియా, పిచ్చి పిచ్చి ప్రశ్నలతో విసిగించే జనాలు, రూమర్స్ … వీటన్నిటికి కొన్నిరోజులపాటు దూరంగా వెళ్ళిపోయింది నయనతార.తని ఒరువన్, మాయ, నానుమ్ రౌడి దాన్ చిత్రాలతో మూడు వరుస బ్లాక్బస్టర్స్ అందుకుంది నయన్.
నిన్న నయనతార పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే.అందుకే ఆనందాన్ని ప్రశాంతంగా అనుభవించేందుకు బాయ్ ఫ్రెండ్ తో షికారుకు వెళ్లింది నయన్.
నానుమ్ రౌడిదాన్ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో నయనతార పీకల్లోతు ప్రేమలో మునిగినట్లు తమిళ మీడియా కోడై కూస్తోంది.అది నిజమేనేమో అనుకునేలా ఈ జంట ఎప్పుడు సన్నిహితంగా మెదులుతుంటారు.
ఆ చిత్ర షూటింగ్ సమయంలోనే ఇద్దరు బాగా క్లోజ్ అయిపోయరట.ఇప్పుడు సినిమా కూడా హిట్ అవడంతో ఇద్దరు పండగ చేసుకుంటున్నారు.
ఇటు సినిమా విజయం, అటు పుట్టినరోజు, రెండింటిని పురస్కరించుకొని నయన్, విఘ్నేష్ ఇద్దరు విదేశాలకు వెళ్లారని తమిళ వర్గాల సమాచారం.అక్కడే కొన్ని రోజులు ఎంజాయ్ చేసి ఇండియాకు తిరిగొస్తారట.
ఇక వేరే వార్తల్లో వెంకటేష్ – మారుతి కాంబినేషన్లో తెరకెక్కనున్న రాధకృష్ణ చిత్రంతో తిరిగి తెలుగు తెరపై కనిపించనుంది నయనతార.