బి గోపాల్ ఒకప్పుడు ఎంత పెద్ద దర్శకుడో మనకు తెలుసు.సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, ఇంద్ర .
ఇలా చాలా తక్కువ సమయంలో మూడు ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన దర్శకుడు ఆయన.కాని కాలంతో పాటే ఆడియెన్స్ మారారు, బి గోపాల్ డిమాండ్ కూడా పడిపోయింది.మధ్యలో రామ్ తో మస్కా అంటూ ఓ యావరేజ్ సినిమాని వదిలిన ఈ దర్శకుడు ఆ తరువాత గోపిచంద్ – నయనతారలతో ఓ సినిమాని మొదలుపెట్టారు.కాని ఆ సినిమా ప్రొడక్షన్ పూర్తి చేసుకున్నా, ఏవో ఫైనాన్షియల్ కారణాల వలన ఆగిపోయింది.
ఇప్పుడు మూడు-నాలుగేళ్ళు గడిచిన తరువాత ఆ సినిమాని విడుదల చేస్తున్నారు.జూన్ 9 “ఆరడుగుల బుల్లెట్” విడుదల కానుంది.
అసలే జనాలు మర్చిపోయిన సినిమా కదా.కొంచెం ప్రమోషన్స్ అవి ఇవి బాగా చేస్తే మంచి ఓపెనింగ్స్ వస్తాయని ప్రమోషన్స్ కోసం నయనతారని సంప్రదించారట.ఓ వారంరోజులు ప్రమోషన్స్ కోసం కేటాయించమని అడిగారట.కాని నయనతార ఇలా పిలవగానే అలా వచ్చేరకం కాదుగా.తమిళనాట లేడి సూపర్ స్టార్ తను.ఆ సినిమా మొదలుపెట్టినప్పుడు నయనతార రేంజ్ వేరు, ఇప్పుడు వేరు.ప్రమోషన్స్ కి వస్తాను కాని 30 లక్షలు ఇస్తేనే అంటూ కండీషన్స్ పెట్టింది.
అసలే అర్థిక ఇబ్బందుల వలన సినిమాని ఇన్నేళ్ళు వాయిదా వేస్తూ వచ్చారు నిర్మాత తాండ్ర రమేష్.
ప్రమోషన్స్ కి రావడానికి కూడా 30 లక్షలు అడిగితే ఆయన ఏం చేస్తాడు చేతులు ఎత్తేయడం తప్ప.ఆ 30 లక్షలు ఏదో టీవి, పేపర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు నయన కన్నా బాగా ప్రమోట్ చేస్తారు కదా.