హాట్ బ్యూటి నయనతార మరో సంచలనానికి తెరలేపుతోంది.ఇప్పటికే దాదాపు మూడు కోట్ల పారితోషికంతో దక్షిణాదిలో నెం.1 కథానాయికగా వెలుగొందుతోంది నయన్.ఈ నంబర్ మరింత పెరగబోతోంది ఇప్పుడు.
విక్రమ్ కొత్తగా నటిస్తున్న చిత్రం “ఇరు ముగన్”.ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతారతో పాటు నిత్య మీనన్ మరో కథానాయికగా నటిస్తోంది.
ఇక ఈ చిత్రంలో నయనతార బికిని వేసే సన్నివేశం ఒకటి ఉందట.బిల్లా తరువాత ఇంతకాలానికి బికిని వేస్తోంది నయనతార, కాని ఒక కండీషన్ తో.ఇలా చెప్పగానే అలా బికిని వేస్తే తను నయనతార ఎందుకవుతుంది.
బికిని వేయాలంటే పారితోషికం ఇంకా పెంచాల్సిందే అంట.ఇప్పటికే మూడు కోట్లు చెల్లిస్తున్న నిర్మాత ఈ కండిషన్ వినగానే ఖంగుతిన్నాడట.బికిని సీన్ ఉండాలంటే ఎక్ట్రా డబ్బులు ఇవ్వాల్సిందే .ఇవ్వకుండా ఉండలేడు … ఎందుకంటే అక్కడ ఉన్నది నయనతార.