వారు వాడుకోలేదంటున్న నయన్‌

నయనతార ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదంతో మీడియా ముందుకు వస్తూనే ఉంది.గత కొన్ని రోజులుగా కామ్‌గా ఉన్న నయన్‌ తార తాజాగా మరో సారి మీడియాలో వార్త వస్తున్న అయ్యింది.

 Nayanthara Count To Producers-TeluguStop.com

తాజాగా ఈమెపై ప్రముఖ హీరో శింబు ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ మరియు సౌత్‌ ఇండియా ఫిల్మ్‌ ఆర్టిస్ట్‌ అసోషియేషన్స్‌లో ఫిర్యాదు చేశాడు.తన సినిమా ‘ఇదు నమ్మ ఆళు’లో నటించేందుకు డేట్లు ఇచ్చిన నయనతార ఇప్పుడు చిత్రీకరణలో పాల్గొనేందుకు రమ్మంటున్నా కూడా రావడం లేదని, మద్యలో తమ సినిమాను వదిలేయడం వల్ల తమకు కోట్లలో నష్టం వస్తుందని శింబు ఆవేదన వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశాడు.

నయనతారపై ఫిర్యాదు రావడంతో, ఆమెను సంప్రదించిన ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ వారికి ఆమె నుండి ఘటైన సమాధానం వచ్చింది.నయనతార ఈ విషయంపై స్పందిస్తూ… శింబు సినిమాలో తాను హీరోయిన్‌గా నటించేందుకు డేట్లు ఇచ్చిన మాట వాస్తవమే.

ఇప్పటికే తాను ముందుగా ఇచ్చిన డేట్ల కంటే ఎక్కువ రోజులు ఆ సినిమా కోసం వ్యచ్చించాను అని, అయితే అనుకున్న సమయంలో వారు ఆ సినిమాను పూర్తి చేయలేక పోగా, తన డేట్లను సరిగా వాడుకోలేక పోయారు అంటూ క్లారిటీ ఇచ్చింది.ఎప్పుడు ఒకే సినిమాకు డేట్లు ఇచ్చుకుంటూ ఉండలేము కదా, అంతకు ముందు డేట్లు ఇచ్చిన సినిమాలను ప్రస్తుతం తాను పూర్తి చేసే పనిలో ఉన్నట్లుగా నయన్‌ పేర్కొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube