దసరా నవరాత్రులు ఈ రోజుతో ప్రారంభం అవుతున్నాయి.ఈ తొమ్మిది రోజులు ఎంతో నియమ నిష్టలతో అమ్మవారిని పూజిస్తారు.
ఇలా పూజించటం వలన ఇంటిలో అన్ని శుభాలే కలుగుతాయి.అయితే నవరాత్రి పూజ మొదలు పెట్టిన ఈ రోజు నుంచి దశమి వరకు కొన్ని నియమాలను పాటించాలి.
ఆలా నియమ నిష్టలతో పూజ చేస్తే ఇంటిలో సుఖ సంతోషాలు ఉంటాయి.మరి ఆ నియమాల గురించి తెలుసుకుందాం.
ఈ నవరాత్రి తొమ్మిది రోజులు పండ్లు,పాలు మాత్రమే తీసుకోని ఒక పూట మాత్రమే భోజనం చేయాలి.
అమ్మవారి పూజను పూజగదిలో కానీ తూర్పు దిక్కున కానీ ఏర్పాటు చేసుకుంటే మంచిది.
మామిడి తోరణం,పువ్వులతో ఆ ప్రాంతాన్ని అలంకరించాలి.
త్రిసూలం,సింహ వాహనంతో ఉన్న అమ్మవారిని ప్రతిష్ఠిస్తే మంచిది.
ప్రతి రోజు అష్టోత్తరాలు, లలితా పారాయణం, దేవి సహస్రాలు పారాయణ చేస్తే మంచిది.
ఈ తొమ్మిది రోజులు బంతి, కనకాంబరం, చామంతి, జాజి ఇలా అన్ని రకాల పువ్వులతో అమ్మవారిని పూజించాలి.
ఈ తొమ్మిది రోజులు రోజుకొక నైవేద్యాన్ని అమ్మవారికి నివేదించాలి.
ఈ తొమ్మిది రోజులు నేల మీద పడుకోవడం, బ్రహ్మచర్యం పాటించటం ముఖ్యం.
ఆయుధ పూజ రోజున ఆయుధాలను, వాహనాలను పూజించాలి.
ఇలా తొమ్మిది రోజులు నియమ నిష్టలతో అమ్మవారిని పూజిస్తే అమ్మవారి అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది.