కొత్త సీఈసీ వచ్చారు

దేశానికి కొత్త ఎన్నికల అధికారి నియమితులయ్యారు.చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా నసీం జైదీ నియమితులయ్యారు.

 Nasim Zaidi Takes Charge As Cec-TeluguStop.com

ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటరు కేంద్ర బిందువుగా ఎన్నికల సంఘం కార్యకలాపాలు సాగుతాయన్నారు.ఓటరు నమోదుపై దృస్టి సారిస్తామన్నారు.

ఎన్నికల సంఘాన్ని మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో వ్యవహరించేలా చేస్తామన్నారు.కొత్త ఆలోచనలు చేస్తామన్నారు.

కొత్త విధానాలు ప్రవేశపెడతామన్నారు.జైదీ రెండేళ్ల పైచిలుకు పదవిలో ఉంటారు.

ఇది త్రిసభ్య ఎన్నికల సంఘం కాబట్టి ప్రభుత్వం మరో ఇద్దరు కమిషనర్లను నియమించాల్సి ఉంది.ఇప్పటివరకు హెచ్‌ఎస్‌ బ్రహ్మ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.

ఒకప్పటి కంటే ఎన్నికల సంఘం రానురాను పకడ్బందీగా పనిచేస్తోంది.అయితే ధన ప్రవాహాన్ని అరికట్టడం సాధ్యం ఆకవడంతలేదు.

ఎన్నకల ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించిన, అవనీతికి పాల్పడిన నాయకులకు కూడా సరైన శిక్షలు పడటంలేదు.కొత్త ఎన్నికల అధికారి ఈ దిశగా ఆలోచిస్తారా?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube