బీజేపీ ఫైర్ బ్రాండ్ సుబ్రహ్మణ్యం స్వామి , ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గు మనేలగా ఉంది పరిస్థితి.సుబ్రహ్మణ్యం స్వామి సొంత పార్టీ లో నేతల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడం దానికి మోడీ గట్టి కౌంటర్ ఇవ్వడం తో మొదలైన ఈ వివాదం రోజు రోజుకూ ముదురుతోంది.
అచ్చే దిన్ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.స్వామీ వ్యవహార శైలి మీద మోడీ సీరియస్ అవుతున్నా కూడా స్వామీ ఎక్కడా తగ్గడం లేదు.
అచ్చే దిన్ మీద విమర్శిస్తూ వాస్తవ జీడీపి గణాంకాలను వెల్లడిస్తే పెద్ద వివాదం చెలరేగకమానదని పేర్కొన్నారు.ఈ రోజు ఆయన తన ట్విట్లర్లో వాస్తవ జీడీపీ గణాంకాలను తాను వెల్లడిస్తే అది కచ్చితంగా తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నానంటూ విమర్శలు వెల్లువెత్తడం ఖాయమని పేర్కొన్నారు.
స్వామి కావాలనే ఇలా చేస్తూ ఉండడం తో మోడీ సైతం చిరాకు గా ఉన్నారట.ఇప్పటి వరకూ కాంగ్రెస్ మీద ఆయన ఏదేదో మాట్లాడుతుంటే ఎంజాయ్ చేసిన బీజేపీ మోడీ ఇప్పుడు స్వయంగా సొంత పార్టీ మీద ఆయన విరుచుకుపడుతూ ఉండే సరికి షాక్ అవుతున్నారు.