భారత ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ఎన్నికైనప్పటి నుంచి మోడీ క్రేజ్ రోజు రోజుకు బాగా పెరిగిపోతోంది.మోడీకి ప్రపంచవ్యాప్తంగా భారతీయులతో పాటు ఇతర దేశాల ప్రజల్లో సైతం ఎంతో ఆదరణ ఉంది.
మోడీకి ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో లభిస్తోన్న ఆదరణే మోడీకి రోజు రోజుకు పెరుగుతోన్న క్రేజ్ను సూచిస్తోంది.
ఇక తాజాగా మోడీ మరో అరుదైన రికార్డుకు చేరువవుతున్నట్టు టైమ్ పత్రిక సర్వే చెపుతోంది.
టైమ్ పత్రిక ప్రపంచంలో వివిధ నాయకులు, కళాకారులు, ఇతర ప్రభావవంతమైన వ్యక్తులందరిలో టాప్ ఎవరు అన్న అంశంపై చేస్తోన్న సర్వేలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీయే టాప్ అని తేలింది.
టైమ్ పత్రిక తరపున పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కోసం జరుపుతున్న ఈ సర్వే ఫలితాల్లో విన్నర్ ఎవరు అనేది ఈ నెల 7న టైమ్ ఎడిటర్లు వెల్లడించనున్నారు.
ప్రస్తుతానికి ప్రజల నుంచి వచ్చిన ఫలితాలు చూస్తే మాత్రం మోడీ ముందంజలో ఉన్నారు.ఆదివారం అర్ధరాత్రితో ఈ సర్వే గడువు ముగిసేసరికి నరేంద్రమోడీకి అత్యధికంగా 18 శాతం ఓట్లు వచ్చాయి.
ఈ విషయంలో మోడీకి సమీప ప్రత్యర్థులుగా ఉన్న బరాక్ ఒబామా, డోనాల్డ్ ట్రంప్, జూలియన్ అసాంజే.వీళ్లందరికీ కూడా కేవలం 7 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.
హిల్లరీ క్లింటన్కు 4 శాతం, మార్క్ జుకర్బర్గ్కు 2 శాతం ఓట్లు వచ్చాయి.మోడీకి భారతీయులతో పాటు కాలిఫోర్నియా, న్యూజెర్సీ ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో ఓట్లు వచ్చినట్టు సమాచారం.
ఇక టైమ్ సంస్థ ప్రతి యేడాది ప్రపంచంలో అత్యంత ప్రతిభవంతమైన వ్యక్తులపై సర్వే చేసి ఫలితాలు ప్రకటిస్తోన్న సంగతి తెలిసిందే.