ఏపీలో టీడీపీ సీనియర్ లీడర్, రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఆయన కోడలు నారా బ్రాహ్మణిని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారట.చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు అయిన మురళీమోహన్ ఆ ఫ్యామిలీనే ఇబ్బంది పెట్టేయడం ఏంటన్నది కాస్త షాకే.
అసలు మ్యాటర్ ఏంటంటే మురళీమోహన్ ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా ఉన్నారు.ఆయన వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని, తనకు టీటీడీ చైర్మన్ పదవి కావాలని బాబు వద్ద ప్రపోజల్ పెట్టగా బాబు ఆయన ప్రతిపాదన తిరస్కరించారు.
టీటీడీ చైర్మన్ పదవి కోసం టీడీపీలో పోటీ తీవ్రంగా ఉండడంతో ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఈ పదవి తాను ఇవ్వనని తేల్చిచెప్పేశారు.దీంతో మురళీమోహన్కు ఈ విషయంలో షాక్ తప్పలేదు.2014 ఎన్నికల్లో 1.57 లక్షల భారీ మెజార్టీతో గెలిచిన ఆయన క్రమక్రమంగా రాజమండ్రి లోక్సభ నియోజకవర్గ ప్రజలకు దూరమవుతూ వస్తున్నారు.నియోజకవర్గంలో ప్రస్తుతం ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉంది.
ఇవన్నీ గమనించిన ఆయన వచ్చే ఎన్నికల్లో తాను తప్పుకుని, తన కోడలు రూపాదేవిని బరిలోకి దింపాలని భావించారు.
అయితే చంద్రబాబు మాత్రం ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లూరి ఇంద్రకుమార్ పేరును రాజమండ్రి లోక్సభ సీటుకు పరిశీలిస్తున్నారు.ఇక్కడ తన పప్పులు ఉడికేలా లేవని భావించిన ఆయన అమరావతిలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునే క్రమంలో రాజధాని కేంద్రాలుగా ఉన్న విజయవాడ లేదా గుంటూరు నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ప్లాన్ వేశారు.
మురళీమోహన్ ఇప్పటికే రాజధాని ప్రాంతంలో భారీగా భూములు కొనుగోలు చేసినట్టు సమాచారం.ఈ క్రమంలోనే ఆయన అక్కడ ఎంపీగా పోటీ చేయాలని బాబు ప్రెజర్ చేస్తున్నారట.అయితే బాబు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచే తన కోడలు నారా బ్రాహ్మణిని పోటీ చేయించాలని స్కెచ్ గీశారు.ఈ క్రమంలోనే విజయవాడ ఎంపీ కేశినేని నానిని పక్కన పెట్టేస్తోన్న బాబు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ను రాజ్యసభకు పంపనున్నారు.
తన కోడలు కోసం ఇలా స్కెచ్లు గీసుకుంటూ వస్తోన్న చంద్రబాబుకు ఇప్పుడు మురళీమోహన్ రూపంలో పెద్ద ఇబ్బందే ఎదురవుతోంది.బ్రాహ్మణిని గుంటూరు నుంచి పోటీ చేయించాలని భావిస్తుండగా మురళీమోహన్ కూడా గుంటూరు సీటే అడుగుతున్నారట.
ఏదేమైనా మురళీమోహన్ నిర్ణయాలతో బ్రాహ్మణికి కాస్త టెన్షన్ తప్పేలా లేదు.