క‌త్తులు దూయ‌బోతున్న కోడ‌ళ్లు

ఇద్ద‌రూ బ‌ల‌మైన రాజ‌కీయ కుటుంబాల‌కు చెందిన వారు.వీరిద్ద‌రూ ఉన్న‌త చదువులు చ‌దివి.

 Nara Brahmani Vs Ys Bharathi-TeluguStop.com

బిజినెస్ రంగంలో త‌మ‌కంటూ ఓ ముద్ర వేసుకున్నారు.భ‌ర్త అడుగుజాడ‌ల్లో న‌డుస్తూనే.

ఒక నిర్ణ‌యాత్మ‌క శ‌క్తిగా, స‌క్సెస్ ఫుల్ బిజినెస్ వుమెన్స్‌గా అవార్దులు కూడా అందుకున్నారు.ఇప్ప‌డు వీరిద్ద‌రూ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి అడుగుపెట్ట‌బోతున‌నారు.

వారే చంద్ర‌బాబు కోడ‌లు బ్ర‌హ్మ‌ణి, వైఎస్ కోడ‌లు భార‌తి.ఏపీలో ఎన్నికల వేడి రగులుకుంటోంది.

రాష్ట్రంలో అధికారం కోసం కొట్లాడుతున్న రెండు కుటుంబాలకు చెందిన మహిళలు 2019 ఎన్నికల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తలపడ బోతున్నారు.నారా,వై.

ఎస్ కుటుంబాల కోడళ్ళు ఇప్పటి నుంచే ఆ ఎన్నికల యుద్ధానికి సిద్ధం అవుతున్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం దివంగ‌త‌ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కుటుంబాల‌ మ‌ధ్య రాజ‌కీయ వైరం.

ఇప్పుడు వ్య‌క్తిగ‌త వైరంగా మారిపోయింది.ప్రస్తుతం చంద్ర‌బాబుకు, వైఎస్ త‌న‌యుడు జ‌గ‌న్‌కు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమనేంత వైరం ఉంది.

ఇది ఇప్పుడు త‌ర్వాతి త‌రానికి కంటిన్యూ అవుతోంది.ఇప్పుడు ఈ పోరులోకి ఈ కుటుంబాల కోడ‌ళ్లు ఎంట‌ర్ అవ‌బోతున్న‌ట్లు వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.నారా వారి కోడ‌లు బ్రాహ్మ‌ణి, వైఎస్ కోడ‌లు భార‌తి.2019 ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్షంగా రాజ‌కీయాల్లోకి రాబోతున్నార‌నే గుస‌గుస‌లు పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో ఊపందుకున్నాయి.

నందమూరి ఆడపడుచుగా, నారా వారి కోడలుగా ఇప్పటికే టీడీపీ సర్వే వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్న బ్రాహ్మణి ని వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారట.స్వర్గీయ ఎన్టీఆర్ పుట్టిన కృష్ణా జిల్లాలోని విజయవాడ లోక్ సభకు ఆమెని పోటీ చేయించాలని సీరియస్ ఆలోచన సాగుతోంది.

అందుకే ఆయ‌న త‌న‌యుడు లోకేష్ కి విజయవాడ బాధ్యతలు అప్పగించబోతున్నట్టు సమాచారం.బ్రాహ్మణి గెలుపు భారాన్ని లోకేష్ మీద పెడుతున్నట్లు సంకేతాలిచ్చారు.ఎక్కడ నుంచి పోటీ చేసినా బ్రాహ్మణి తో కీలక నియోజకవర్గాల్లో ప్రచారం చేయించే ఆలోచన కూడా ఉందంటున్నారు.

ఇక వై.ఎస్ కోడలు, జగన్ సతీమణి భారతి కూడా వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యక్షంగా ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయట.జగన్ కి కేసుల వల్ల ఏ ఇబ్బంది వచ్చినా, లేకున్నా ఆయన భారాన్ని మోయడానికి భారతి సిద్ధంగా ఉన్నారట.

పార్టీ పనులన్నీ భారతికి అప్పగించడానికి జగన్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.కడప లోక్‌స‌భ నుంచి భారతిని పోటీ చేయించాలని ఆలోచిస్తున్నారట.జిల్లాలో తగ్గుతున్న బలాన్ని పెంచుకోడానికి ఈ వ్యూహం పనికొ స్తుందని జగన్ నమ్ముతున్నారట.జగన్ జైలుకి వెళితే భారతి రాష్ట్రవ్యాప్త ప్రచారానికి కూడా కదిలే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది.

మ‌రి ఈ కోడ‌ళ్లు ఎలా నెట్టుకువ‌స్తారో వేచిచూడాల్సిందే!!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube