యంగ్టైగర్ ఎన్టీఆర్, ఆర్య సుకుమార్ కాంబినేషన్లో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్ఎల్పి అండ్ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై బి.వి.
ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘నాన్నకు ప్రేమతో.’.ఈ చిత్రం టీజర్ను విజయదశమి కానుకగా అక్టోబర్ 22 సాయంత్రం 6 గంటలకు విడుదల చేయబోతున్నారు.నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ – ”విజయదశమి కానుకగా ‘నాన్నకు ప్రేమతో.’ టీజర్ని రేపు(అక్టోబర్ 22) సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తున్నాం.ఈ చిత్రానికి సంబంధించి 60 రోజులపాటు లండన్లో భారీ షెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే.
మళ్ళీ ఇప్పుడు నవంబర్ 1 నుంచి స్పెయిన్లో నెలరోజుల పాటు మరో భారీ షెడ్యూల్ చెయ్యబోతున్నాం.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం” అన్నారు.
యంగ్టైగర్ ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, సితార, అమిత్, తాగుబోతు రమేష్, గిరి, నవీన్ తదితరులు నటిస్తున్నారు.