నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ తరపున హిందూపురం అసెంబ్లీ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెల్సిందే.ఇక కేంద్రంలో తెలుగు దేశం పార్టీ, బీజేపీతో పొత్తు పెట్టుకుని ఉంది.
ఈ నేపథ్యంలో బీజేపీపై తెలుగు దేశం పార్టీకి విమర్శలు చేయకూడదు.కాని పొత్తు ధర్మాన్ని పక్కన పెట్టి బాలకృష్ణ బీజేపీపై తీవ్ర స్థాయి విమర్శలు గుప్పించాడు.
తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్పై బాలయ్యబాబు నిప్పులు చెరిగాడు.ఆంధ్రప్రదేశ్కు తీవ్ర అన్యాయం చేశారంటూ కేంద్రం తీరుపు బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశాడు.
వేల కోట్లు కావాల్సిన పోలవరంకు కేవలం 100 కోట్లు కేటాయించడంపై బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.ఏపీకి ప్రత్యేక హోదాను ఇస్తామని హామీలు గుప్పించిన కేంద్రం ఇప్పుడు మాట మార్చి, కనీస నిధులను కూడా రాష్ట్రానికి కేటాయించలేదు అంటూ మండి పడ్డాడు.
బడ్జెట్లో తీవ్ర అన్యాయం చేశారని, ఇప్పటికైనా ఏపీకి న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేంద్ర ప్రభుత్వం తీరుకు ఆందోళనలు చేసే అవకాశాలున్నాయని అన్నాడు.తెలుగు వాడి ఆత్మ గౌరవం దెబ్బ తింటే కేంద్ర ఇబ్బందుల్లో పడక తప్పదని కూడా బాలయ్య హెచ్చరికలు జారీ చేశాడు.
బాలయ్య ఈ హెచ్చరికలు ఆయన వ్యక్తిగతం అని తెలుగు దేశం పార్టీ ప్రకటించింది.