నడి రోడ్డుపై ఎంపీని కాల్చేశారు!!!

కెన్యాలో దారుణం చోటు చేసుకుంది.నడి రోడ్డుపై ఎంపీని కాల్చి చంపిన ఘటన సామాన్యులను భయాందోళనకు గురి చేసింది.

 Mp Murdered On Road-TeluguStop.com

విషయం ఏమిటంటే…కెన్యాలో ఓ ఎంపీతోపాటు అతని బాడీగార్డులను దుండగులు నడి రోడ్డుపై కాల్చి చంపారు.దేశ రాజధాని నైరోబీలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

ఎంపీ హత్య పక్కా ప్లాన్‌ ప్రకారం జరిగిందని పోలీసులు నిర్ధారించారు.నైరోబీ ప్రధాన వీధిలో న్యూస్‌ పేపర్‌ కొనుక్కునేందుకు వాహనాన్ని ఆపిన ఎంపీ జార్జ్‌ ముసాయ్‌ను అతి సమీపంలో దుండగులు షూట్‌ చేశారు.

ఈ ఘటనలో ఇద్దరు బాడీ గార్డులతోపాటు కారు డ్రైవర్‌ కూడా మృతి చెందాడు.కెన్యా ప్రభుత్వ కూటమికి చెందిన ముసాయ్‌ రెండేళ్ల క్రితం ఎంపీగా ఎన్నికయ్యారు.

ఎంపీని షూట్‌ చూసిన తర్వాత దుండగులు ఆయన షూట్‌కేస్‌ను ఎత్తుకెళ్లారు.ఎంపీ హత్యను దేశ అధ్యక్షుడు ఉరు కెన్యట్టా ఖండించారు.

దాడికి పాల్పడ్డ వారు బ్రీఫ్ కేసును, బాడీగార్డ్స్ వద్ద ఉన్న పిస్టోల్స్‌ను దొంగిలించుకు పోయినట్లు పోలీసులు తెలిపారు.ప్రజాప్రతినిధులకే రక్షణ లేకపోతే.

ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటో

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube