ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘శంకరాభరణం’.నిఖిల్, నందిత జంటగా తెరకెక్కిన ఈ క్రైమ్ కామెడీ చిత్రం విడుదలకు సిద్దం అవుతోంది.
ఈ సినిమా ప్రమోషన్ కోసం కోన వెంకట్ తన ముందు ఉన్న వనరులు అన్ని కూడా వాడేసుకుంటున్నాడు.మొదట ఈ చిత్రం ట్రైలర్ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో విడుదల చేయించిన విషయం తెల్సిందే.
ఆ తర్వాత ఆడియోను పొడుగు స్టార్ రానాతో విడుదల చేయించాడు.తాజాగా చైతూ కూడా కోన కోసం ముందుకు రావడంతో ఈయన్ను కూడా వాడేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
‘శంకరాభరణం’ థీమ్ సాంగ్ను నాగచైతన్యతో విడుదల చేయించేందుకు కోన వెంకట్ ఏర్పాట్లు చేశాడు.ఇండస్ట్రీలో తనకు ఉన్న పరిచయాలతో ఈ సినిమాను ఇప్పటికే ప్రేక్షకు మనస్సుల్లోకి తీసుకు వెళ్లాడు.
చిన్న చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు మంచి పబ్లిసిటీ రావడంతో విడుదలకు ముందే నిర్మాతకు లాభాలు తెచ్చి పెట్టింది.నాగచైతన్య కూడా ఈ సినిమా ప్రమోషన్లో పార్ట్ అవ్వడంతో సినిమాకు క్రేజ్ మరింతగా పెరిగే అవకాశాలున్నాయి.
వచ్చే నెల మొదటి వారంలో సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుందని నిర్మాత కోన వెంకట్ అంటున్నాడు.
‘స్వామిరారా’, ‘కార్తికేయ’, ‘సూర్య వర్సెస్ సూర్య’ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన నిఖిల్ ఈ చిత్రంతో కూడా సక్సెస్ కొట్టడం గ్యారెంటీ అని సినీ విశ్లేషకులు అంటున్నారు.