అక్కినేని నాగచైతన్య తాజా చిత్రం ‘దోచేయ్’.‘స్వామిరారా’ ఫేం సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.
ఇటీవలే ఈ సినిమా ఫస్ట్లుక్ను విడుదల చేశారు.ఆ ఫస్ట్లుక్కు మంచి స్పందనే వచ్చింది.
ఇక ఇప్పటికే షూటింగ్ ముగిసింది.ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయంపై ఆసక్తి నెలకొంది.
ఏప్రిల్ మరియు మే నెలల్లో భారీ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి.దాంతో ఈ సినిమాకు సరైన సమయం దొరికే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అంటున్నారు.
వరుసగా సక్సెస్లు దక్కించుకుంటూ వస్తున్న నాగచైతన్యకు ఈ సినిమా సక్సెస్పై చాలా నమ్మకంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.చైతూ మొదటి సారి ఇలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
ఈ సినిమాలో ఈయన దొంగగా కనిపించనున్నట్లుగా సినీ వర్గాల వారు చెబుతున్నారు.దొంగతనాల నేపథ్యంలో వచ్చిన ‘స్వామిరారా’ సినిమా మంచి సక్సెస్ అవ్వడంతో పాటు, అదే సినిమా దర్శకుడు సుధీర్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించడంతో ఆసక్తి నెలకొంది.
ఈ సినిమాలో ‘1’ బ్యూటీ కృతిసనన్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెల్సిందే.త్వరలో ఈ సినిమా విడుదలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.