టీవీ ఛానల్స్ లో మంచి పేరు ఉన్న టీవీ 9 మీద మైదకూరు ఎమ్మెల్యే – వైకాపా నాయకుడు రఘురామి రెడ్డి మండిపడ్డారు.తాను వైకాపా ని వీడి తెలుగుదేశం లో కి వెళుతున్నట్టు ఆ ఛానల్ ప్రచారం చెయ్యడం పట్ల ఆయన విస్మయం చెందారు.
టీవీ 9 అంటే గౌరవం ఉంది కానీ వారు చెబుతున్న అవాస్తవాలు దారుణం అన్నారు ఆయన.పార్టీ మారే అవకాశంలేని తమలాంటివారిపై ఇలాంటి ప్రచారమా అని ప్రశ్నించారు.
ఓ పార్టీ ద్వారా ఎన్నికైన ఎమ్మెల్యేలను వేరే పార్టీవారు పిలవటమే తప్పని అన్నారు.ఒకవేళ ఎమ్మెల్యేలు మరో పార్టీలో చేరితే నియోజకవర్గాల్లో ఎలా తిరుగుతారని రఘురామిరెడ్డి ప్రశ్నించారు.
ఇవాళ ఆయన కడపలో పర్యటిస్తున్న జగన్ను పొద్దుటూరులో కలిశారు.తర్వాత మీడియాతో మాట్లాడుతూ జగన్ వెంటే తన పయనమని చెప్పారు.
తమ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నట్లు న్యూస్ ఛానల్స్ ఇష్టమొచ్చినట్లు వార్తలు ప్రసారం చేస్తున్నాయని ఆరోపించారు.