నాయకులు ఎప్పుడు ఏమి మాట్లాడుతారో అర్ధం కాదు.ఎప్పుడు ఏం తోస్తే అది మాట్లాడుతుంటారు.
ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి చంద్రబాబు నాయుడిని యమ తిట్టిపోసిన గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఇప్పుడు ఆయన్ని అదే పనిగా పొగుడుతున్నారు.ఎన్ని తిట్టినా తెలుగు దేశం పార్టీలో చేర్చుకున్న తరువాత ఎమ్మెల్సీ కూడా చేశారు.
అందుకే వారానికో, పది రోజులకో ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యర్థి పార్టీలను తీవ్రంగా విమర్శిస్తుంటారు.తప్పదు కదా.కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, వైఎస్సర్సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ చంద్రబాబును విమర్శించారు.వరద బాధితులను ప్రభుత్వం ఆడుకోవడం లేదన్నారు.
నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో పునరావాస చర్యలు తీసుకోవడం లేదన్నారు.దీనిపై ముద్దు విమర్శలు చేస్తూ రఘువీరా, బొత్స మంత్రులుగా విఫలం అయ్యారని దుయ్యబట్టారు.
ఇలాంటి విమర్శలు వారు పదవుల్లో ఉన్నప్పుడే చేయాలి.విఫలం అయ్యారని ఒక మాట అంటే సరిపోతుందా? ఎలా విఫలం అయ్యారో వివరిస్తే ప్రజలు కూడా అర్ధం చేసుకుంటారు.రాజకీయ నాయకులు ఎప్పుడూ సహేతుకమైన విమర్శలు చేయరు.అందుకే వారి విమర్శలకు విలువ ఉండదు.