ప్రముఖ కమెడియన్ ఎమ్మెస్ నారాయణ నేడు ఉదయం కన్నుమూశాడు.సంక్రాంతి సంబరాల కోసం భీమవరం వెళ్లిన ఎమ్మెస్ నారాయణ అక్కడ అనారోగ్యం పాలయ్యారు.
వెంటనే స్థానికంగా ఉన్న హాస్పిటల్లో చికిత్స చేయించారు.ఆ తర్వాత హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు.
గత నాలుగు రోజులుగా ఎమ్మెస్ కిమ్స్లో చికిత్స పొందుతున్నాడు.ఈయన నిన్ననే చనిపోయినట్లుగా వార్తలు వచ్చాయి.
అయితే ఆ వార్తలను కుటుంబ సభ్యులు తోచిపుచ్చారు.నిన్న సాయంత్రం కూడా ఎమ్మెస్ నారాయణ ఆరోగ్యంపై కిమ్స్ వైధ్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేయడం జరిగింది.
కాని ఉన్నట్లుండి ఇలాంటి వార్త వినాల్సి వచ్చింది.తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి, మెప్పించిన ఎమ్మెస్ మృతితో ఆయన అభిమానులు మరియు తెలుగు సినిమా పరిశ్రమ శోఖ సంద్రంలో మునిగింది.
ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం.