దేశం మొత్తం గర్వించదగ్గ వ్యక్తి, భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం హఠాత్ మరణంతో దేశ వ్యాప్తంగా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం అయ్యింది.దేశానికి రాష్ట్రపతిగా చేయడమే కాకుండా, ఎంతో విలువైన మిస్సైల్ సంపదను దేశానికి ఇచ్చిన కలాం చివరకు మరణించే సమయంకు తన కంటూ ఏ ఆస్తిని కూడబెట్టుకోలేదు.
ఇంతటి గొప్ప వ్యక్తికి దేశ వ్యాప్తంగా ఘనమైన నివాళి అర్పించింది.ఇక సినిమా పరిశ్రమ కూడా కలాంకు తమదైన శైలిలో నివాళి అర్పించేందుకు సిద్దం అవుతోంది.
కలాం జీవిత చరిత్రను తెరకెక్కించి ఆయనకు నివాళి అర్పించాలని నీలా మాధవ్ పాండా నిర్ణయించుకున్నాడు.
బాలీవుడ్ ప్రముఖ ఫిల్మ్ మేకర్ అయిన పాండా ప్రస్తుతం కలాం జీవిత చరిత్ర పుస్తకాలను తిరగేసే పనిలో ఉన్నాడు.
ఆయన ఎంతో మందితో చర్చించి కలాం జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కబోయే సినిమాకు స్క్రిప్ట్ను రెడీ చేయబోతున్నాడు.ఇక కలాం పాత్రలో బాలీవుడ్ బిగ్బి అమితాబచ్చన్ నటించే అవకాశాలున్నాయి.
ఇప్పటికే అమితాబచ్చన్ ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశాలున్నాయి.