తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర విమర్శలు చేశాడు.రాజయ్యను బలిపశువు చేసి తప్పించాడని కేసీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
రాజయ్యను మంత్రి పదవి నుండి తప్పించడంతో ఆయన తట్టుకోలేక పోయాడని, దాంతో గుండె పోటు వచ్చిందని, ఇందుకు కేసీఆర్ కారణమంటూ మోత్కుపల్లి అన్నాడు.చికిత్స కోసం హాస్పిటల్కు వెళ్లిన రాజయ్యను తన అధికారాన్ని ఉపయోగించి అక్కడి నుండి గెంటేయించాడని ఆరోపించాడు.
కేసీఆర్కు మాదిగలు అంటే చిన్నచూపు అని, దళిత మంత్రిని తీసేసినప్పుడు ఆ స్థానంలో దళితుడినే తీసుకోవాల్సి ఉంటుంది.కాని ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ వ్యక్తిని ఆ స్థానంలో నియమించాడని అన్నాడు.
కడియం శ్రీహరిది దళిత రక్తం కాదని, ఆయన తల్లిదండ్రులు దళితులు కాదని మోత్కుపల్లి అన్నాడు.దేశంలో ఒక్క తెలంగాణలో మాత్రమే దళిత మంత్రి లేకుండా ఉన్నాడని మోత్కుపల్లి చెప్పుకొచ్చాడు.
కేసీఆర్ మంత్రి వర్గంలో ఒక్క దళితుడు కూడా లేక పోవడం ఆశ్చర్యం అని అన్నాడు.