మోడికి ఏమిటి చుక్కలు చూపించడం ఏమిటి అనుకుంటున్నారా.అవును మోడికే సొంత రాష్ట్రంలో ముగ్గురు కుర్రాళ్ళు చుక్కలు చుపిస్తున్నారట.
మాములుగా అయితే అధికార పక్షానికి.ప్రతిపక్షానికి పోసగదు.
కానీ మోడికి కాంగ్రెస్ కంటే ఎక్కువ ఈ ముగ్గురు కుర్రాళ్ళు ఏకు మేకయ్యి కూర్చున్నారు.ఇంతకీ ఈ ముగ్గురు ఎవరు.
వీళ్ళ పని ఏమిటి ? వీళ్ళు ఏమి చేస్తారు అనేకదా డౌట్.విషయంలోకి వెళ్తే.
మోడికి తన సొంత ఇలాఖాలో కాంగ్రెస్ కంటే ప్రధాన ప్రతిపక్షం హార్దిక్ పటేల్.మోడిని ఏకి పారేయడంలో మనోడు బాగా దిట్ట అనేది వేరేగా చెప్పక్కలేదు.
ఇప్పుడు హార్దిక్ కి తోడుగా మరొక ఇద్దరు కలిసారు .హార్దిక్ పటేదార్ల ఉద్యమం లేవనేత్తడంలో ప్రముఖ పాత్ర పోషించాడు.పటేదార్ ఆందోళన్.అనామాట్ సమితిని నడుపుతున్నాడు.మోడిని తన సొంత ఇలాఖాలో ఈసారి గెలవబోనివ్వను అని అంటున్నాడు.ఇతని పంధా ఇలా ఉంటే మరొక ఇద్దరు హార్దిక్ కంటే డిఫ్ఫ్రెంట్.
జిగ్నేష్ మోవాని – రాష్ట్రీయ దళిత్ అధికార్ నడుపుతున్నాడు .ఇంకొకరు అల్పేష్ ఠాకూర్ –క్షత్రియ ఠాగూర్ సేన నడుపుతున్నాడు.ఇప్పుడు ఈ ముగ్గురూ మేడిపై ముప్పేట దాడి చేయడానికి సిద్దంగా ఉన్నారు.మోడీ వ్యవహరించే ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజలకి తెలియచేస్తాం అని చెప్తున్నారు.గుజరాత్ లో మొత్తం 182 స్థానాలు ఉండగా వీరి ముగ్గురి ప్రభావం సుమారుగా 100 స్థానాలపైనే ఉంటుంది అని చెప్తున్నారు.ఇప్పుడు గుజరాత్ లో మోడీ ప్రభుత్వానికి ఉన్న సీట్లు అటు ఇటుగానే ఉన్నాయి.
ఇప్పుడు వీరు అనుకున్న కార్యక్రమాన్ని కనుకా మొదలు పెడితే వీళ్ళ ప్రభావం అక్కడి ఓటర్లమీద తీవ్రంగా చూపుతుంది అని చెప్తున్నారు.గుజరాత్ లొ మోడికి ఉన్నంత ఫాలోయింగ్ వెల్లకి లేకపోయినా వీరి ప్రభావం మటుకూ వచ్చే ఎన్నికల్లో కనిపిస్తుంది అని చెప్తున్నారు విశ్లేషకులు
.