తెల్లారితే ఓ చేదు కబురు వింటున్నారు శ్రీనువైట్ల.మూడు వరుస డిజాస్టర్లతో అన్నిరకాలుగా ఢీలాపడ్డారు ఈ ఒకనాటి స్టార్ డైరెక్టర్.
ఆగడు, బ్రూస్ లీ అపజయాలతో టాప్ హీరోలకి అల్రెడీ దూరమైన వైట్ల, చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో వరుణ్ తేజ్ తో మిస్టర్ చేసారు.అసలు వైట్లతో వరుణ్ సినిమా చేయడం మొదట నాగబాబుకి ఇష్టం లేదట.
కాని కమర్షియల్ హీరోగా వరుణ్ ని నిలబెట్ఠాలనే తాపత్రయంతో ఈ సినిమా మొదలుపెట్టారు.అప్పటికీ సెకండాఫ్ మీద నాగబాబుకి చాలా అనుమానాలున్నా, శ్రీను వైట్ల నేను చూసుకుంటానని అభయహస్తం ఇవ్వడంతో నాగబాబు సైలెంట్ అయిపోయారు.
ఇదిలా ఉంటే, మిస్టర్ బడ్జెట్ మొదట 15 కోట్లను అనుకున్నారు.వరుణ్ మార్కేట్, శ్రీను వైట్ల ఫామ్ ని దృష్టిలో పెట్టుకోని అంతకుమించి ఒక్క రూపాయి పెట్టేది లేదని నిర్మాతలు ఠాగూర్ మధు, నల్లమలపు బిజ్జి కండీషన్ పెట్టారట.
కాని సినిమా మొదలయ్యాక ఆ కండీషన్లు దారితప్పాయి.బడ్జెట్ అదుపుతప్పింది.15 కోట్ల బడ్జెట్ కాస్త 20 కోట్లు దాటి, 25 కోట్ల దాకా వెళ్ళింది.ఫారెన్ లొకేషన్లు, అనవసరపు పాటలు, అనవసరపు సీన్లతో కథలో ముందులేని లెంగ్త్ ని తీసుకొచ్చారట వైట్ల.
సెకండాఫ్ లో సీజీ షాట్స్ ఉండటంతో బడ్జెట్ మరింత ఎక్కువైపోయింది.
అసలే మిస్టర్ ఏరియా హక్కులు తీసుకోని, అప్పుల్లో కూరుకుపోయి, సొంత ఇల్లు అమ్మేసుకున్న వైట్లకి మరో ఎదురుదెబ్బ.
నిర్మాతలు ఈ డైరెక్టర్ మీద కేసు వేయాలనుకుంటున్నారట.చెప్పిన బడ్జెట్ లో సినిమా తీయకుండా, డబ్బులు అనవసరంగా ఖర్చు చేయించాడు అనేది అభియోగం.
త్వరలోనే ఈ విషయం మీద లీగల్ చర్చలు జరగనున్నాయని ఫిలింనగర్ టాక్.