ఏపీలో మంత్రి పదవి రేసులో ఉన్న కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాన్మరణం చాలా ప్రశ్నలు లేవనెత్తుతోంది.మంత్రి పదవి హామీతోనే భూమా తన కుమార్తె ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియతో కలిసి టీడీపీలోకి జంప్ చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు సడెన్గా భూమా మృతి చెందడంతో చంద్రబాబు భూమాకు బదులుగా ఆయన కుమార్తె అఖిలప్రియకు మంత్రి పదవి ఇస్తారన్న టాక్ ఏపీ పొలిటికల్ తెరపైకి వచ్చింది.
బాబు కేబినెట్లో ఇప్పటికే ముగ్గురు మహిళా మంత్రులు ఉన్నారు.
అనంతపురం జిల్లాకు చెందిన పరిటాల సునీత, విజయనగరం జిల్లా నుంచి కిమిడి మృణాళిని, పశ్చిమగోదావరి జిల్లా నుంచి పీతల సుజాత మంత్రులుగా కొనసాగుతున్నారు.వీరిలో పీతలతో పాటు మృణాళినిపై వేటు కత్తి వేలాడుతోంది.
మరి కేబినెట్ ప్రక్షాళన భారీ స్థాయిలో ఉంటుందని వార్తలు వస్తున్నాయి.
అదే జరిగితే వీరిలో చంద్రబాబు ఎవరిని తప్పించి అఖిలప్రియకు బెర్త్ ఇస్తారన్నదానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
మరోవైపు ఈ ముగ్గురు మహిళా మంత్రులు కూడా అఖిలప్రియ ఎంట్రీ ఎవరికి ఎర్త్ పెడుతుందోనని ఎవరి లెక్కల్లో వారు మునిగి తేలుతున్నారు.ఏదేమైనా సునీత ప్లేస్ మాత్రం సేఫే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
అఖిలప్రియకు బెర్త్ ఇవ్వకపోతే భూమా వర్గం నుంచి పెద్ద ఎత్తున నిరసన ఎదుర్కోక తప్పదు.ఇక అఖిలకు మంత్రి పదవి ఇస్తే టీడీపీకి పెద్ద ఎత్తున సానుభూతితో పాటు కర్నూలు జిల్లాలోను, రెడ్డి సామాజికవర్గంలోను ప్లస్ అవుతుంది.
దీంతో అఖిలప్రియకు మంత్రి పదవి ఖాయంగా కనిపిస్తోండగా… పీతల, మృణాళినికి మాత్రం టెన్షన్ టెన్షన్గానే ఉందట.