ఏపీలో ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు 2019 ఎన్నికల్లో నియోజకవర్గం మారనున్నారా ? ఆయన ప్రస్తుతం ప్రాథినిత్యం వహిస్తోన్న మైలవరంకు గుడ్ బై చెప్పి కొత్త నియోజకవర్గం వెతుక్కోనున్నారా ? అంటే కృష్ణా జిల్లా రాజకీయాల్లో అవుననే ఆన్సర్ వస్తోంది.గతంలో రెండుసార్లు నందిగామ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఉమా నందిగామ ఎస్సీ అవ్వడంతో ఆయన పక్కనే ఉన్న మైలవరంకు మారారు.
మైలవరంలో కూడా ఉమ 2009, 2014 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు విజయం సాధించారు.
మంత్రిగాను మంచి మార్కులే వేయించుకుంటోన్న ఉమాకు నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు జిల్లా రాజకీయాల్లో గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఉమా మైలవరంకు స్థానికేతరుడు.వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ తరపున బలమైన అభ్యర్థుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజ్గోపాల్ సైతం ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉంటారన్న ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలోనే ఉమా వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేయరని టాక్.
నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉమా ఇబ్రహీంపట్నం లేదా కంచికచర్ల కేంద్రంగా ఏర్పడే జనరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అప్పుడే సన్నాహాలు స్టార్ట్ చేసుకున్నారు.ఇక నియోజకవర్గాల పునర్విభజన జరగని పక్షంలో పెనమలూరుపై కూడా ఉమా కన్నేసినట్టు తెలుస్తోంది.
ఇక మరో ఆప్షన్ ఏంటంటే తాను గతంలో ప్రాథినిత్యం వహించిన నందిగామ ఎస్సీ నుంచి జనరల్ అయినా ఉమా అక్కడ నుంచి అయినా బరిలో ఉండే ఛాన్సులు ఉన్నాయి.ఏదేమైనా ఉమా నియోజకవర్గం మార్పు కృష్ణా జిల్లాలో సంచలనంగా మారింది.