కాపులకు అండగా ప్రభుత్వం నిలస్తు అన్ని సౌకర్యాలు కలిగించేలా ఏర్పాటు జరుపుతున్నప్పుడు ముద్రగడ దీక్ష అవసరం ఏముందని మంత్రి నారాయణ నిలదీసారు.వైకాపాకు లబ్దిచేసేందుకు ముద్రగడ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని, ఇప్పుడు పోలీసు స్టేషన్లముందు ముద్రగడ చేస్తున్న దీక్ష, రౌడీషీటర్ల కోసమేనని కాపుల కోసమా? అని నిలదీసారు.
‘కులం, మతం పేరిట ఆంధ్రప్రదేశ్ను విచ్ఛిన్నం చేసి, విధ్వంసం సృష్టించాలని ప్రధాన ప్రతిపక్షం కుట్రలు పన్నుతోంది.తెదేపాది నిర్మాణాత్మక విధానమైతే వైకాపాది విధ్వంసపూరితం అని దీనిని నిలువరించడం ఎదురుదాడి ఎలా అవుతుందని ప్రశ్నించారు.
రాష్ట్రాన్ని అప్రతిష్ఠ పాల్జేయాలని వైకాపా ప్రయత్నిస్తోందని, ఆ పార్టీ నేర చరిత్ర, అవినీతి, కుంభకోణాలు, విధ్వంసకాండకు కాంగ్రెస్ మద్దతుగా నిలుస్తున్నట్లు హర్షకుమార్ వ్యాఖ్యలు ఋజువు చేస్తున్నాయని వ్యాఖ్యానించారాయన.
రైలును, పోలీస్ స్టేషన్ని తగలేయటాన్ని లైట్ తీసుకోవాలంటూ అమలాపురం మాజీ పార్లమెంటు సభ్యులు హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు.
శాంతి యుతంగా పోరాటాలు చేస్తామంటూ దీక్షను ప్రారంభించిన నేతలు ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసినా, పోలీసులు సంయమనం పాటించి దాడులలో గాయపడినప్పుడు ఎందుకు స్పందించలేదని నిలదీసారాయన.విధ్వంసకాండపై విచారణ జరిపి ఉద్యమకారులలో కలసిపోయిన విధ్వంస కారులను గుర్తించి అరెస్టు చేయటం తప్పంటూ నినదించడం, దీక్షలు చేయటం ప్రజలు గమనిస్తున్నారన్నారు ఏపి మంత్రి నారాయణ,
.